ప్రజారోగ్యంపై కేసీఆర్కు పట్టింపు లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్కు కొత్త సచివాలయం, పార్టీ కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసుల నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపైన లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్, హాథ్సే హాథ్ జోడో యాత్ర మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
హాథ్సే హాథ్ జోడో యాత్ర మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి
గాంధీభవన్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్కు కొత్త సచివాలయం, పార్టీ కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసుల నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపైన లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్, హాథ్సే హాథ్ జోడో యాత్ర మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన ‘హాథ్సే హాథ్ జోడో’ యాత్రలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఆ పార్టీ ఛార్జిషీట్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం గాంధీభవన్లో మహేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన మానిటరింగ్ కమిటీ సమావేశంలో ‘వైద్య ఆరోగ్య శాఖలో హామీలు- వైఫల్యాలు’ అంశంపై ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి హరీశ్రావు వైద్య, ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఛార్జిషీట్లో 16 అంశాలను పొందుపరిచినట్లు వివరించారు.
కొన్ని అంశాలు..
* తెలంగాణలో 1,600 పీహెచ్సీలు ఉండాల్సి ఉండగా.. అవి సగానికే పరిమితమయ్యాయి.
* వాటిలోనూ సిబ్బంది కొరత ఉంది.
* మండల స్థాయిలో 30 పడకల దవాఖానా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి, జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానాల హామీలు అమలుకు నోచుకోలేదు.
* బడ్జెట్లో వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయించే నిధుల్లో కోత విధించారు.
* ‘108’, ‘104’లను నీరుగార్చారు.
* ప్రతి వ్యక్తికి ‘హెల్త్ ప్రొఫైల్ రికార్డు’ హామీ నెరవేరలేదు.
* ఆరోగ్యశ్రీ బకాయిలు అందక ప్రజల ఆరోగ్యం ప్రమాదకరంలో పడింది.
* జర్నలిస్టుల హెల్త్కార్డులు పనిచేయడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్