Nara Lokesh: మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు
మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి ఇప్పటికీ అమలు చేయలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
ప్రభుత్వంపై లోకేశ్ మండిపాటు
పాడి రైతులను ఆదుకుంటామని హామీ
ఈనాడు- తిరుపతి, ఈనాడు డిజిటల్- చిత్తూరు: మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి ఇప్పటికీ అమలు చేయలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకూ అన్నీ ఆయన అనుచరులే చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబోయే 20ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని విమర్శించారు. 2024లో ఏ ముఖం పెట్టుకుని తెలుగింటి ఆడపడుచులను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం కుప్పం నియోజకవర్గంలో మహిళలు, పాడి రైతులు, అన్నదాతలతో ఆయన సమావేశమయ్యారు. శాంతిపురం ఆదివారం సంతలో తిరిగి చిరు వ్యాపారులతో మాట్లాడారు. మూడో రోజు ఆయన 11 కి.మీ. నడిచారు. ‘తెలుగింటి ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగనే. ఇంట్లో పిల్లలందరికీ అమ్మ ఒడి ఇస్తామని ఆయన సతీమణి భారతీరెడ్డి చెప్పారు. ఇప్పుడు రావట్లేదు. 45 ఏళ్లున్న మహిళలకు పింఛను లేదు. అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలను మూడు సార్లు పెంచారు. భారీగా పన్నులు వేయడంతో పక్క రాష్ట్రాల కంటే పెట్రోలు, డీజిల్ ధరలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. వాటిపై పన్నులు తగ్గిస్తే నిత్యావసరాల ధరలూ తగ్గుతాయి. దీనిపై సమీక్షించి నిత్యావసరాల ధరలను తగ్గించే బాధ్యతను తెదేపా తీసుకుంటుంది’ అని చెప్పారు.
అమూల్కు దోచిపెడుతున్నారు
‘జగన్ సీఎం అయిన తర్వాత రూ.650 కోట్ల ఆస్తులున్న చిత్తూరు డెయిరీని అమూల్ డెయిరీకి రూ.కోటికి అప్పగించారు. చిత్తూరు, ఒంగోలు డెయిరీలు మూతపడ్డాయి. రైతుల పేరిట రూ.3వేల కోట్లు అప్పు చేసి అమూల్కు అప్పగిస్తున్నారు. అదే డబ్బు రైతులకు ఇస్తే ఎలా ఉండేదో ఆలోచించాలి. పాడి పరిశ్రమలో యువత భాగస్వామ్యాన్ని పెంచే అంశాన్ని యూత్ మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. పాడి రైతులను ప్రోత్సహించి మెరుగైన పథకాలను తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. ‘మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాడు వేస్తే తిరగబడండి. మీటర్లు పగలగొట్టండి’ అని లోకేశ్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినందుకు వైకాపా కార్యకర్తలు 30 మంది వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టారని, పింఛను తొలగించారని విజయలక్ష్మి అనే మహిళా కార్యకర్త కన్నీటిపర్యంతమయ్యారు. అయినా చంద్రబాబు కోసం పోరాటం చేస్తాననడంతో లోకేశ్ ఆమెను ఓదార్చారు. కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలను సాగనివ్వబోమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకుంటే పెద్దిరెడ్డి వద్దకు తీసుకెళతామని బెదిరించినా వెనక్కి తగ్గకపోవడంతో తనకు ఇంటి పట్టా ఇవ్వలేదని ఓ మహిళ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రయ్యాక ఇల్లు కట్టుకుని ఆయనతోనే గృహ ప్రవేశం చేయించుకుంటానని ఆమె తెలిపారు.
హారతులు పట్టిన మహిళలు
‘యువగళం’ పాదయాత్ర ఆదివారంతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముగిసింది. సోమవారం నుంచి పలమనేరు నియోజకవర్గంలో మొదలు కానుంది. ఆదివారం ఉదయం శాంతిపురం మండలం పెద్దబొమ్మనపల్లె నుంచి నుంచి రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె వరకు సాగిన పాదయాత్రకు స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. పలమనేరు- క్రిష్ణగిరి జాతీయ రహదారికి దూరంగా ఉన్న గ్రామాల్లోని మహిళలు ఆటోలు, ట్రాక్టర్లలో రోడ్డుపైకి చిన్నారులతో వచ్చి లోకేశ్కు హారతులు పట్టారు.
‘యువగళానికి’ కర్ణాటక పోలీసుల భారీ బందోబస్తు
కర్ణాటక సరిహద్దులో ఉన్న గుండిశెట్టిపల్లె నుంచి రాజుపేట వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగింది. యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించగానే ఆ రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. బేతమంగళం సీఐ సునీల్ రాజు ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేసి లోకేశ్కు రక్షణ వలయంగా నిలిచారు. ఓ డీఎస్పీ అక్కడే ఉండి ఎక్కడికక్కడ వాహనాలను మళ్లించి పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూశారు. దీంతో లోకేశ్ కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పలమనేరు, కృష్ణగిరి జాతీయ రహదారిపై ఆయన మైక్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం జీవో 1ను తీసుకువచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని.. ఆఖరికి మైక్ వినియోగించకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్