ఎస్పీ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్, స్వామి ప్రసాద్ మౌర్య
సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్య సహా 14 మంది నియమితులయ్యారు.
అధ్యక్షునిగా కొనసాగనున్న అఖిలేశ్
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్య సహా 14 మంది నియమితులయ్యారు. అధ్యక్షునిగా అఖిలేశ్ యాదవ్, జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా రాంగోపాల్ యాదవ్ కొనసాగే జాతీయ కార్యవర్గంలో మొత్తం 63 మంది నేతలకు స్థానం లభించింది. జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా జయాబచ్చన్ సహా పలువురు ఉంటారు. నూతన కార్యవర్గాన్ని పార్టీ ఆదివారం ప్రకటించింది. రామచరితమానస్పై వ్యాఖ్యలు చేసి వివాదం రేకెత్తించిన స్వామి ప్రసాద్ మౌర్యను ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని భాజపా తప్పుపట్టింది. అఖిలేశ్-శివపాల్ మధ్య 2016 నుంచి విభేదాలు ఉండేవి. పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మరణానంతరం గత ఏడాది డిసెంబరులో మైన్పురి లోక్సభ స్థాన ఉప ఎన్నికల్లో మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్