సంక్షిప్త వార్తలు(6)
తెదేపా ప్రభుత్వం ఏర్పాటైతేనే తెలంగాణలోని ప్రజలకు అన్ని రకాల మేలు జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.
తెదేపాతోనే తెలంగాణ ప్రజలకు మేలు: కాసాని
ఈనాడు, హైదరాబాద్: తెదేపా ప్రభుత్వం ఏర్పాటైతేనే తెలంగాణలోని ప్రజలకు అన్ని రకాల మేలు జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం ఏర్పాటవడానికి అన్నివర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు సోమవారం ఎన్టీఆర్ భవన్లో కాసాని సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠానికి రాష్ట్రంలోని 1,300 మండలాలు, మున్సిపల్ డివిజన్లలో ఇంటింటికి తెదేపా కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టనున్నట్లు వివరించారు.
బడ్జెట్లో బీసీలకు నిధులు పెంచాలి: జాజుల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, దళిత బంధు తరహాలోనే బీసీ బంధును ప్రవేశపెట్టాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.
రూ.20 వేల కోట్లకు పెంచాలి: ఆర్.కృష్ణయ్య
కాచిగూడ, న్యూస్టుడే: రాష్ట్రంలో బీసీల బడ్జెట్ను రూ.20 వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు రూ.4 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ.2 వేల కోట్లను కేటాయించాలన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్నట్లు బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం పూర్తి ఫీజును చెల్లించాలన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీల్లో చదివే బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర నిధుల దుర్వినియోగం
రాష్ట్ర ప్రభుత్వంపై పురందేశ్వరి ధ్వజం
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, తుళ్లూరు గ్రామీణ: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి వాటిని దుర్వినియోగం చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. గుంటూరు జిల్లా భాజపా కార్యకర్తల సమావేశం సోమవారం తుళ్లూరు మండలం నెక్కల్లులో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ఏ రహదారి చూసినా గుంతలమయంగా ఉందని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో 22లక్షల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులిస్తే అవి నిర్మాణాలకు నోచుకోలేదు. ఒక్కో ఇంటికి రూ.1.8లక్షలు కేటాయిస్తే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇసుక, మద్యం మాటున పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకుండా ప్రజలను వంచించింది. రాజధాని అమరావతికి భాజపా కట్టుబడి ఉంది. ఎవరు ఏం మాట్లాడినా అమరావతే ఏపీ రాజధాని’ అని ఉద్ఘాటించారు.
ఎమ్మెల్యే ద్వారంపూడిని కలిసిన ముద్రగడ
కాకినాడ, న్యూస్టుడే: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధికార పక్షానికి చెందిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కలిశారు. కాకినాడలోని రాయల్పార్కు హోటల్లో సోమవారం ఇరువురూ భేటీ అయ్యారు. ముద్రగడ పద్మనాభం తన వ్యక్తిగత పని నిమిత్తం ద్వారంపూడిని కలిసినట్లు తెలుస్తోంది. ఓ స్థలం విషయంలో నెలకొన్న వివాదంపై చర్చించినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. వ్యక్తిగతమైన అంశంపైనే ఈ భేటీ జరిగిందా.. రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అంశం చర్చనీయాంశమైంది.
గందరగోళంలో ఉద్యోగులు: బుద్ద
అనకాపల్లి, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గందరగోళానికి లోనవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. అనకాపల్లి తెదేపా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
సీఎం జగన్ చెట్లు నరికించారని చదువుకోవాలేమో?: సోమిరెడ్డి
ఈనాడు డిజిటల్, అమరావతి: అశోకుడు చెట్లు నాటిస్తే...సీఎం జగన్ చెట్లు నరికించారని భావితరాలు చదువుకునేలా చేస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సోమవారం ట్విటర్లో విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేనీటి వెనక కన్నీటి ధారలు!
మన దేశంలో వేడివేడి ఛాయ్ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! -
12 మందికి నేరచరిత్ర
రాజస్థాన్లో లోక్సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి. -
నవనీత్ రాణా.. ఓ నృత్యకారిణి
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. -
సంక్షిప్త వార్తలు
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. మోదీ వచ్చాకే ఈ ప్రాంతం మిగిలిన దేశంతో మమేకమైంది. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
ఇది వారణాసి, వయనాడ్ మధ్య పోరాటం
తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీని తాము కోరినా వయనాడ్ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
రాహుల్ను ప్రధానిని చేయాలి: తుమ్మల
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. -
మాదిగలకు కాంగ్రెస్ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లో అమీర్పేట లీలానగర్లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. -
భాజపాను అడ్డుకుంటేనే రేవంత్కు, లౌకికవాదానికి మంచిది
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
రేవంత్రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. -
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. -
ఈటల సేవలు దేశానికి అవసరం
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. -
రత్నగిరి-సింధుదుర్గ్ భాజపా అభ్యర్థిగా నారాయణ్ రాణె
కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. -
భారాస నాయకులను చేర్చుకోవద్దు
భారాస నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాయకుడు శేఖర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. -
అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
ఎన్నికల కమిషన్ కాదు.. భాజపా కమిషన్: మమత
ముర్షీదాబాద్ రామనవమి ర్యాలీలో చోటు చేసుకున్న హింసపై పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. -
ఢీకొడుతున్న ఇండియా!
రాజస్థాన్లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
పశ్చిమ పవర్ ఎవరిది?
సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు