గవర్నర్ను బద్నాం చేసేందుకు యత్నించి భంగపడ్డారు
‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్ల్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలను గవర్నర్కు పంపించడం ఆనవాయితీ. వాటిని గవర్నర్ వెనక్కి పంపించలేదు.
సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విమర్శ
నారాయణగూడ, గన్ఫౌండ్రి, న్యూస్టుడే: ‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్ల్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలను గవర్నర్కు పంపించడం ఆనవాయితీ. వాటిని గవర్నర్ వెనక్కి పంపించలేదు. తిరస్కరించలేదు. అసెంబ్లీ సమావేశాలకు ఇంకా సమయం ఉంది. ఇంతలోనే కోర్టుకు వెళ్లి గవర్నర్ను బద్నాం చేసేందుకు యత్నించి ముఖ్యమంత్రి భంగపడ్డారు. ఆయన హైకోర్టుకు వెళ్లిన ప్రతిసారీ మొట్టికాయలే పడ్డాయి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఇటీవల డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించి పోలీసుల లాఠీఛార్జిలో గాయపడి.. చికిత్స పొందుతున్న భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేయడానికి వచ్చిన భాజపా యువమోర్చా నాయకులను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు కనీసం డీపీఆర్ ఇవ్వలేదని, 8 సార్లు లేఖ రాసినా స్పందన లేదని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఆయన వెంట జాతీయ ఎస్సీ కమిషన్ పూర్వ సభ్యులు రాములు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM