గాంధీ హత్య నుంచే దేశంలో ఉగ్రవాదం తీవ్రరూపం
స్వతంత్ర భారతదేశంలో మహాత్మాగాంధీని గాడ్సే కాల్చి చంపిన రోజు నుంచే దేశంలో ఉగ్రవాదం క్రూరరూపం దాల్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు.
ట్విటర్లో మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: స్వతంత్ర భారతదేశంలో మహాత్మాగాంధీని గాడ్సే కాల్చి చంపిన రోజు నుంచే దేశంలో ఉగ్రవాదం క్రూరరూపం దాల్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. జాతిపిత గాంధీ ఆశయాలను ఆచరిద్దామని, శాంతి, మత సామరస్యాన్ని కాపాడటమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని ట్విటర్లో కేటీఆర్ పేర్కొన్నారు
జాతీయవాదం పేరిట అవమానించొద్దు..
ప్రధాని నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త అదానీ.. హిండెన్బర్గ్ నివేదికలోని అంశాలపై స్పష్టత ఇవ్వకుండా జాతీయవాదం పేరు చెప్పి తప్పించుకోవాలనుకోవడం ఘన దేశప్రజలను అవమానించడమే అవుతుందని మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. హిండెన్బర్గ్ నివేదికపై అదానీ గ్రూపు ఇచ్చిన వివరణను ఉద్దేశించి ఆయన ఈ వాఖ్యలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
Politics News
Arvind Kejriwal: బాబోయ్ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్ కౌంటర్
-
World News
Japan: పితృత్వ సెలవులు ఇస్తామంటే.. భయపడిపోతున్న తండ్రులు