డీడీఎల్జే మంత్రాన్ని పఠిస్తున్న మోదీ సర్కారు: కాంగ్రెస్
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత దాచాలని చూసినా చైనా విషయంలో తన విధానం విఫలమైందనే వాస్తవాన్ని మరుగుపరచలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ సోమవారం ఉద్ఘాటించారు.
దిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత దాచాలని చూసినా చైనా విషయంలో తన విధానం విఫలమైందనే వాస్తవాన్ని మరుగుపరచలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ సోమవారం ఉద్ఘాటించారు. భారీ విస్తీర్ణంలో భారత భూభాగాన్ని చైనా హస్తగతం చేసుకుందనే వాస్తవాన్ని మోదీ సర్కారు ఇక ఏమాత్రం కప్పిపుచ్చలేదని ఆయన అన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 2017లో చైనా రాయబారితో సమావేశమయ్యారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యలు చవకబారుగా ఉన్నాయని విమర్శించారు. జైశంకర్ అమెరికాలో భారత రాయబారిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్షమైన రిపబ్లికన్ పార్టీ ప్రముఖులతోనూ సమావేశమయ్యేవారని జైరాం గుర్తుచేశారు. లద్దాఖ్లో చైనా దురాక్రమణపై మోదీ ప్రభుత్వ విధానం డి.డి.ఎల్.జెలా ఉందని రమేశ్ వ్యంగ్య విమర్శ చేశారు. డి.డి.ఎల్.జె అనేది బాలీవుడ్ సూపర్హిట్ చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’కు పొడి అక్షరాలుగా ప్రసిద్ధమైనా, జైరాం రమేశ్ దాన్ని డినై (తిరస్కరించు), డిస్ట్రాక్ట్ (దృష్టి మళ్లించు), లై (అబద్ధమాడు), జస్టిఫై (సమర్థించుకో)గా మార్చి ప్రయోగించారు. మోదీ సర్కారు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై విరుచుకుపడేకన్నా లద్దాఖ్లో దెప్సాంగ్, దెమ్ చోక్ ప్రాంతాల నుంచి చైనా సేనలను వెళ్లగొట్టడంపై శ్రద్ధ చూపాలని రమేశ్ హితవు చెప్పారు. 2020 మే నెల నుంచి మోదీ ప్రభుత్వం లద్దాఖ్లోని 65 గస్తీ కేంద్రాలకు 26 కేంద్రాలను చైనాకు జారవిడచుకుందని ఆయన అన్నారు. చైనా సమస్యపై మోదీ సర్కారు పార్లమెంటులో, పార్లమెంటు స్థాయీ సంఘాల్లో చర్చ జరిపి ఉండాల్సిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ