సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం
రాష్ట్రంలో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తరచూ పేర్కొనడం హాస్యాస్పదమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే ఆస్తిపరుడు, అరాచక వాది మరొకరు లేరని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తరచూ పేర్కొనడం హాస్యాస్పదమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే ఆస్తిపరుడు, అరాచక వాది మరొకరు లేరని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్రంలోని పేదలకు ఆయనకు మధ్యనే యుద్ధమని చెప్పకనే చెబుతున్నారా అని ప్రశ్నించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఎక్కడ బటన్ నొక్కడానికి వెళ్లినా అక్కడ రోడ్లపై ఉన్న పచ్చని చెట్లను నరికి వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అశోకుడు చెట్లను నాటించెను అని చెప్పేవారని, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి చెట్లను నరికిస్తున్నాడని చెబుతున్నారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తన తమ్ముడు అవినాష్రెడ్డిని విచారించేటప్పుడు న్యాయవాది ఉండాలని, వీడియో చిత్రీకరించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అవినాష్రెడ్డి అమాయకుడని చెబుతున్న ఎమ్మెల్యేలు అసలు దోషి ఎవరో చెప్పాలని కోరారు. దిల్లీలో డీవోపీటీ అధికారులను కలిసి సీఐడీ మాజీ అధిపతి సునీల్కుమార్పై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను మరోసారి అందజేస్తానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని