Nara Lokesh: ఒక్క అవకాశమంటూ బీసీల గొంతుకోశారు
ఒక్క అవకాశం ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన జగన్.. బీసీల గొంతు కోశారని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’లో ఆక్షేపించారు.
అధికారంలోకి వచ్చాక వైకాపా వారు 26 మంది బీసీల్ని చంపారు
2,650 మందిపై అక్రమకేసులు పెట్టారు
‘యువగళం’లో ప్రభుత్వంపై లోకేశ్ ధ్వజం
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, బైరెడ్డిపల్లె: ఒక్క అవకాశం ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన జగన్.. బీసీల గొంతు కోశారని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’లో ఆక్షేపించారు. తెదేపా హయాంలో 90 శాతం రాయితీతో రూ.10 లక్షల దాకా రుణాలిచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని, పైగా వైకాపా నాయకులు, కార్యకర్తలు 26 మంది బీసీలను బలి తీసుకున్నారని, 2,650 మందిపై అక్రమకేసులు పెట్టారన్నారు. బీసీల అభ్యున్నతికి వైకాపానే కృషి చేసిందని మంత్రి వేణుగోపాలకృష్ణ చెబుతున్నారని, ఈ అంశంపై చర్చకు సిద్ధమని లోకేశ్ సవాలు విసిరారు. ఎస్సీల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వచ్చినా, లేదంటే పాదయాత్ర షెడ్యూల్లో పేర్కొన్న ఏ గ్రామానికైనా సీఎం జగన్ హాజరైనా బదులిస్తానని చెప్పారు. చిత్తూరు జిల్లా వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లో లోకేశ్ మంగళవారం పాదయాత్ర చేస్తూ రైతులు, కూలీలు, కురబ, బీసీలతో సమావేశమయ్యారు. మహిళలు, చిన్నారులు, యువత అధిక సంఖ్యలో తరలి రావడంతో బైరెడ్డిపల్లె కూడలి కిక్కిరిసింది. కార్యకర్తలు గజమాలతో యువనేతకు స్వాగతం పలికారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ స్వగ్రామం తోటకనుమకు చేసిందేమీ లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. పుట్టి పెరిగిన ఊరినే అభివృద్ధి చేయని వ్యక్తి నియోజకవర్గాన్ని ఎలా బాగుచేస్తారని ప్రశ్నించారు. కష్టపడి రూ.కోట్లు ఖర్చు చేసి దక్కించుకున్న వారి నుంచి గనులు లాక్కోవడం తప్ప ఆయనకు ఏమీ రాదని ధ్వజమెత్తారు.
అక్రమ కేసుల్ని తొలగిస్తాం
‘పెనుకొండ నియోజకవర్గంలో కురబ సామాజికవర్గానికి చెందిన సబితమ్మ రాజకీయంగా ఎదుగుతోందని ఓర్చుకోలేక అధికార పార్టీ నాయకులు ఆమె క్వారీని అక్రమంగా ఆపేశారు. కేసులు నమోదు చేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రత్యేక జీవో తెచ్చి.. బీసీలపై నమోదైన అక్రమకేసుల్ని తొలగిస్తాం’ అని లోకేశ్ స్పష్టంచేశారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, నగరి తెదేపా ఇన్ఛార్జి భానుప్రకాష్, నాయకులు శ్రీధర్వర్మ, బీవీ వెంకటరాముడు, కోదండయాదవ్, సందీప్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
యువనేతకు సమస్యల మొర
వి.కోట మండలం కస్తూరినగరంలో జాతీయ రహదారి పక్కనే సపోటాలు అమ్ముతున్న సుబ్రహ్మణ్యంను లోకేశ్ పలకరించారు. కుమారుడిని బీటెక్ చదివించినా ఉద్యోగం లేక తనతోపాటు సపోటాలు అమ్ముతున్నాడని ఆయన వాపోయారు. కుమ్మరిమడుగులో 80 ఏళ్ల చిన్నరామప్ప మాట్లాడుతూ... తనకు పింఛను ఇవ్వడంలేదని వైకాపా నాయకులను అడిగితే దిక్కున్నచోట చెప్పుకో అన్నారని తెలిపారు. బైరెడ్డిపల్లె మండలం దేవదొడ్డి వద్ద పొలంలో నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో లోకేశ్ మాట్లాడారు. వైకాపా పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని, ఇంటి పట్టాల కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా ఇవ్వలేదని వారు వాపోయారు.
పాదయాత్ర 5వ రోజు
ఎక్కడెక్కడ: చిత్తూరు జిల్లా వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లో
ఎంతదూరం: 14 కిలోమీటర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. -
పొన్నూరు వైకాపా అభ్యర్థిపై చర్యలకు ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. -
రాష్ట్రంలో తొలిరోజు 229 నామినేషన్లు
రాష్ట్రంలో తొలిరోజు లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. -
21న తెదేపా అభ్యర్థులకు బి-ఫాంలు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు. -
పవన్ సమక్షంలో జనసేనలో చేరికలు
మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు. -
ఎఫ్ఓఏల ద్వారా ‘ఐ ప్యాక్’కు రూ.270 కోట్ల మళ్లింపు
వాలంటీర్ల పర్యవేక్షణ, శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీల(ఎఫ్ఓఏ) ద్వారా సుమారు రూ.270 కోట్లను ఐ ప్యాక్కు జగన్ ప్రభుత్వం మళ్లించిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
డీసీసీ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్న పెద్దిరెడ్డి
తన కాళ్లు పట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డీసీసీ అధ్యక్షుడయ్యారని, లేదంటే కాణిపాకంలో కానీ, తరిగొండలోగానీ ప్రమాణం చేయాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘గులకరాయి’ కేసు దర్యాప్తు సాక్షిలోనే ఎందుకొస్తోంది?: వర్ల
సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసుల దర్యాప్తు వివరాలు ఒక్క సాక్షి పత్రికలోనే ఎందుకొస్తున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు