కేటీఆర్పై మాట్లాడే స్థాయి అర్వింద్కు లేదు: జీవన్రెడ్డి
ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి లేదని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు.
ఈనాడు, హైదరాబాద్: ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి లేదని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీలు వి.గంగాధర్గౌడ్, యెగ్గె మల్లేశంలతో కలిసి విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడారు. అర్వింద్ తాగే నీళ్లు కేసీఆర్ ఇచ్చినవేననీ, నడిచే రోడ్డు కేసీఆర్ వేసిందేనని పేర్కొన్నారు. దావోస్లో 52 సమావేశాల్లో పాల్గొని.. రూ.21 వేల కోట్ల పెట్టుబడులు సాధించింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చకు తాను ఎక్కడికి రావడానికైనా సిద్ధమని అర్వింద్కు సవాల్ విసిరారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదనీ.. కాబోయే ప్రధాని కేసీఆరేనని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్