కేటీఆర్‌పై మాట్లాడే స్థాయి అర్వింద్‌కు లేదు: జీవన్‌రెడ్డి

ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడే నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కు మంత్రి కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి లేదని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు.

Published : 01 Feb 2023 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడే నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కు మంత్రి కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి లేదని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్‌, యెగ్గె మల్లేశంలతో కలిసి విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. అర్వింద్‌ తాగే నీళ్లు కేసీఆర్‌ ఇచ్చినవేననీ, నడిచే రోడ్డు కేసీఆర్‌ వేసిందేనని పేర్కొన్నారు. దావోస్‌లో 52 సమావేశాల్లో పాల్గొని.. రూ.21 వేల కోట్ల పెట్టుబడులు సాధించింది కేటీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధిపై చర్చకు తాను ఎక్కడికి రావడానికైనా సిద్ధమని అర్వింద్‌కు సవాల్‌ విసిరారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదనీ.. కాబోయే ప్రధాని కేసీఆరేనని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు