రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ సిగ్గుచేటు
రాష్ట్రపతి ప్రసంగాన్ని భారాస బహిష్కరించడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. దిల్లీ విజయ్చౌక్లో పార్టీ ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్లతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
భాజపా అధ్యక్షుడు బండి సంజయ్
ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి ప్రసంగాన్ని భారాస బహిష్కరించడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. దిల్లీ విజయ్చౌక్లో పార్టీ ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్లతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో భారాస పైకి చెబుతున్నది ఒకటైతే.. లోపలున్న ఉద్దేశం వేరన్నారు. దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీనవర్గాల మహిళలంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు ద్వేషమని ఆరోపించారు. గతంలో మైనారిటీ, ఎస్సీ వ్యక్తులను రాష్ట్రపతులను చేసిన భాజపా.. ఈ సారి ఆదివాసీ మహిళను అభ్యర్థిగా ప్రతిపాదిస్తే భారాస ఓడించేందుకు యత్నించిందని విమర్శించారు. బలహీనవర్గాలకు చెందిన మహిళా గవర్నర్ను అడుగడుగునా అవమానిస్తున్నారని.. కోర్టు గట్టిగా చెప్పాకే ఆమెను శాసనసభకు పిలిచారని పేర్కొన్నారు. ఈ విషయంలో దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీనవర్గాల మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోగానే కేటీఆర్, కవిత విదేశాలకు వెళ్లిపోతారని.. ఎంపీ అర్వింద్ ఆరోపించారు.
భారాస నేతలకు మహిళలంటే చిన్న చూపని.. వారు ఏ స్థాయిలో ఉన్నా అవమానించడమే పనిగా పెట్టుకున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఓ ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికై చేస్తున్న తొలి ప్రసంగాన్ని బహిష్కరించడం ఆ వర్గం మహిళలను అవమానించడమేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM