పార్లమెంటులో ఆహ్లాదకర వాతావరణం
తొలిరోజు పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. అధికార భాజపా, విపక్ష పార్టీల మధ్య స్నేహపూర్వక మాటలు నడిచాయి.
అధికార విపక్ష పార్టీల స్నేహపూర్వక కలయిక
శ్రీనగర్లోనే కొందరు కాంగ్రెస్ సభ్యులు.. సభకు గైర్హాజరు
దిల్లీ: తొలిరోజు పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. అధికార భాజపా, విపక్ష పార్టీల మధ్య స్నేహపూర్వక మాటలు నడిచాయి. భారత్ జోడో యాత్ర ముగింపుతో శ్రీనగర్లోనే ఉండిపోయిన కొందరు కాంగ్రెస్ సభ్యులు.. వాతావరణం అనుకూలించక సభకు హాజరుకాలేకపోయారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరయిన సోనియా గాంధీ మొదటి వరుసలో కూర్చున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సోనియాను పలకరించారు. సమీపంలోనే కూర్చున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆమెతో అరగంటకుపైగా మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. రాజకీయ బద్ధ శత్రువులైన ఏఐఏడీఎంకే, డీఎంకేకు చెందిన ఎం.తంబిదురై, టీఆర్ బాలు ఆలింగనం చేసుకున్నారు. ఐదుగురు కూర్చుండే బెంచ్పై ఎన్సీపీ, డీఎంకే, టీఎంసీకి చెందిన ఎంపీలతో పాటు భాజపాకు చెందిన ముగ్గురు ఎంపీలు(మొత్తం ఆరుగురు) కూర్చున్నారు. లోక్సభ వాయిదా పడిన తర్వాత చిరాగ్ పాసవాన్ తల్లి ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆయన్ని అడిగి తెలుసుకున్నారు. అటు సభ ప్రారంభానికి ముందు భాజపా జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన జేపీ నడ్డాకు ఆ పార్టీ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్