సీఎం, మంత్రులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి
రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉండగా...విశాఖపట్నం రాజధాని కాబోతుందని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్కుమార్ కోరారు.
సుప్రీంకోర్టు అటార్నీ జనరల్కు జడ శ్రవణ్కుమార్ ఫిర్యాదు
ఈనాడు, అమరావతి: రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉండగా...విశాఖపట్నం రాజధాని కాబోతుందని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్కుమార్ కోరారు. సీఎంతో పాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై కూడా చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు అటార్నీ జనరల్కు బుధవారం ఫిర్యాదు చేశారు. రాజధాని అంశంపై సీఎం దిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. విశాఖ రాజధాని కాబోతుందని జగన్మోహన్రెడ్డి అనడం న్యాయ ప్రక్రియలో తలదూర్చడమేనని శ్రావణ్కుమార్ అభ్యంతరం తెలిపారు. అటార్నీ జనరల్తోపాటు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించనట్లయితే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని శ్రావణ్కుమార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్