జూదం అనుమతించాలని ఎమ్మెల్యేను అడ్డుకున్న వైకాపా శ్రేణులు
దేవుడి ఉత్సవంలో జూదానికి అనుమతి ఇవ్వాలని వైకాపా నాయకులు పట్టుబట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.
పెదపూడి (జి.మామిడాడ), న్యూస్టుడే: దేవుడి ఉత్సవంలో జూదానికి అనుమతి ఇవ్వాలని వైకాపా నాయకులు పట్టుబట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో గుండాట, స్కిల్గేమ్స్ వంటి జూదాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. స్థానిక వైకాపా నాయకులు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిని ఆశ్రయించారు. ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడినా అనుమతివ్వలేదు. దీంతో ఎలాగైనా జూదానికి అనుమతి ఇప్పించాలని ఆలయ కమిటీ సభ్యులు, వైకాపా నాయకులు ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్వామి వారి రథోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే దంపతులు ఆలయానికి చేరుకున్నారు. గుండాట, స్కిల్గేమ్స్కు అనుమతి ఇప్పించనిదే ఆలయంలోకి ప్రవేశించకూడదని వైకాపా నాయకుడు చింతా దొరబాబు, అతని వర్గీయులు ఎమ్మెల్యే కారుకు అడ్డంగా బైఠాయించారు. ధర్నా చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. రథోత్సవానికి ఆటంకం లేకుండా చూశారు. ఎమ్మెల్యే తిరిగి వెళ్తున్న క్రమంలోనూ వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల రాకతో సమస్య సద్దుమణిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పోటీ చేయనున్న 10 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో తెలుగుదేశం పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. -
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
మథురలో ప్రజలు నరేంద్రమోదీ ప్రభుత్వానికే పట్టం కడతారని నటి, భాజపా ఎంపీ అభ్యర్థి హేమమాలిని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భాజపా విడుదల చేసింది. -
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
జనసేన పెండింగ్ స్థానాలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు కొనసాగుతోంది. -
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ షోకాజ్ నోటీసులు
భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి: చంద్రబాబు
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్పై నేను చెప్పిందే నిజమైంది: రఘునందన్రావు
తెలంగాణలో రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీకి భాజపా నేత రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. -
సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్ వర్గం, కాంగ్రెస్ మధ్య ‘కిచిడీ’ చిచ్చు
ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం నేతపై కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోదీ ఫోన్
భాజపా అభ్యర్థి రాజమాత అమృతారాయ్ (Amrita Roy)తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ (Modi).. దేశంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
వైకాపా డంప్లు బట్టబయలైనా చర్యలేవీ?: అచ్చెన్నాయుడు
రేణిగుంట ఎఫ్సీఐ గోదాం వద్ద వైకాపా నేతల నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్: కేటీఆర్
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే: చంద్రబాబు
వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. -
వీహెచ్కు బుజ్జగింపులు.. అండగా ఉంటానని సీఎం రేవంత్ భరోసా
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. -
సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చల వేళ.. ఉద్ధవ్ పార్టీ తొలి జాబితా విడుదల
Shiva Sena (UBT): శివసేన (యూబీటీ) పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. -
ఆ కంటెయినర్లో ఏముంది?బ్రెజిల్ సరకా.. మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా?: నారా లోకేశ్
రోజూ తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రశ్నించారు. -
చీరాల వైకాపాలో ముసలం
బాపట్ల జిల్లా చీరాల వైకాపాలో ముసలం రేగింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
నా ఫోన్నూ ట్యాప్ చేశారు: బండి సంజయ్
గత భారాస ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం
లోక్సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. -
జనసేనకు పవన్కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్.. ఆ పార్టీ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన.. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ.రత్నానికి చెక్కు అందజేశారు. -
శింగనమలలో భగ్గుమన్న వైకాపా అసమ్మతి
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
-
హైదరాబాద్ సంచలనం.. ఐపీఎల్ రికార్డు బద్దలు
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు