భారాస.. ఆప్ల ‘మద్యం సంబంధాలు’
దిల్లీ మద్యం కేసుతో భారాస.. ఆప్ సంబంధాలు పెనవేసుకుపోయాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసుతో భారాస.. ఆప్ సంబంధాలు పెనవేసుకుపోయాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. దీంతోనే తెరాస భారాసగా అవతరించిందని విమర్శించారు. దిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు చోటుచేసుకోవడంపై స్పందిస్తూ చట్టం ఎవరి చుట్టం కాదన్నారు. ఖమ్మంలో భారాస సభకు ఆప్ తరఫున దిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరుకావడం చూస్తే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ దేశహితాన్ని కాంక్షించేలా ఉందని కొనియాడారు. హైదరాబాద్లో ఎపోగ్రఫీ మ్యూజియం రానుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!