Bhuma Akhila priya: తెదేపాలో చేరేందుకు శిల్పా కుటుంబం మంతనాలు: అఖిలప్రియ

తెదేపాలో చేరేందుకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా కుటుంబం మంతనాలు సాగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

Published : 03 Feb 2023 08:50 IST

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపాలో చేరేందుకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా కుటుంబం మంతనాలు సాగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాలలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. మార్కెట్‌ యార్డులో భూమా కుటుంబం అరాచకాలను బయటపెడతానన్న ఎమ్మెల్యే ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు అన్ని ఆధారాలతో గాంధీచౌక్‌ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యేకు సవాలు విసిరారు. పురపాలికలో ఎస్సీ, మైనార్టీ కౌన్సిలర్లను గొర్రెలుగా సంబోధించిన కౌన్సిలర్‌ నాగినిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. శిల్పా కుటుంబం తెదేపా పెద్దలతో టచ్‌లో ఉంటూనే తమ పార్టీపై బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. కౌన్సిలర్‌ జైనాబీ మాట్లాడుతూ కౌన్సిలర్‌ నాగినిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని