అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ భద్రత లేదా?
‘‘అధికారపార్టీ ఎమ్మెల్యేలు అభద్రతా భావంతో ఉన్నారు. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులూ లేవు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడం, ఫోను సంభాషణలు దొంగచాటుగా వినడం అనేవి పాలకుల అభద్రతా భావాన్ని బయటపెడుతున్నాయి.
ఫోను ట్యాపింగులు, ప్రాణహాని ఆందోళనలు: పవన్కల్యాణ్
ఈనాడు, అమరావతి: ‘‘అధికారపార్టీ ఎమ్మెల్యేలు అభద్రతా భావంతో ఉన్నారు. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులూ లేవు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడం, ఫోను సంభాషణలు దొంగచాటుగా వినడం అనేవి పాలకుల అభద్రతా భావాన్ని బయటపెడుతున్నాయి. వెంకటగిరి అధికారపార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయనిపిస్తోంది. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై హోంమంత్రి, డీజీపీ ఎందుకు స్పందించరు?’’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఈ అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవహారశైలి, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై ఆనం రామనారాయణరెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరమని ప్రభుత్వ పెద్దలు భావించినట్లున్నారని, ఆయన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారని జనసేన అధినేత విమర్శించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆనం రక్షణ బాధ్యతలు డీజీపీ తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఆయనకు తగిన రక్షణ కల్పించకపోతే ఇక్కడి పరిస్థితులపై కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తామని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్