సాదాసీదాగా గవర్నర్ ప్రసంగం
గాంధీభవన్, న్యూస్టుడే: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంలో పస లేదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పెదవి విరిచారు.
20 ప్రధాన అంశాలపై పోరాడతాం
సీఎల్పీ నేత భట్టివిక్రమార్క
ఈనాడు, హైదరాబాద్: గాంధీభవన్, న్యూస్టుడే: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంలో పస లేదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పెదవి విరిచారు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్నే ఆమె చదివారన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సాదాసీదాగా ఉందని, అందులో రాష్ట్ర ప్రజలు ఎదురుచూసే అంశాలేవీ లేవని అన్నారు. రాజ్యాంగానికి లోబడి ఎవరి పాత్ర వారు పోషిస్తే ఎలాంటి సమస్యా ఉండదన్నారు. బడ్జెట్పై 6 రోజులు, డిమాండ్లపై 18 రోజులు చర్చలు జరిగినప్పుడే సమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఉంటుందన్నారు. బీఏసీలో ప్రతిపక్షాలను అన్నింటినీ పిలిస్తే బాగుండేదని భట్టి అభిప్రాయపడ్డారు.
317 జీఓ రద్దు, రైతు రుణమాఫీ, మద్దతు ధర, బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం, దళితులు, గిరిజనులపై దాడులు, ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతల మరణాలు, ధరణితో రైతుల ఆత్మహత్యలు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ ప్రకటన, కోల్ బ్లాకుల ప్రైవేటీకరణతో పాటు 20 ప్రధాన అంశాలపై శాసనసభలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భట్టి తెలిపారు.
కేజ్రీవాల్ను వెంటనే అరెస్టు చేయాలి..
లిక్కర్ అవినీతి కేసులో కూరుకుపోయిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ను వెంటనే అరెస్టు చేయాలని, ఆ కేసులో ఉన్న అందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని భట్టి డిమాండ్ చేశారు.
పులిలా గాండ్రించి..
గవర్నర్ తమిళిసై బయట పులిలా గాండ్రించి.. లోపల పిల్లిలా ప్రసంగం చేశారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. గవర్నర్, కేసీఆర్ల మధ్య రాజీ కుదిరినందున ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదివారని ధ్వజమెత్తారు. శాసనసభలో గవర్నర్ తమిళిసై ప్రసంగం వాస్తవాలకు దూరంగా, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మోసంతో రైతులు, రైతుకూలీలు, బడుగు బలహీన వర్గాల వారు, మైనారిటీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, వారి సంక్షేమానికి నిధులు వెచ్చించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్