‘హుజూరాబాద్’ ఎందుకు రాలేదు?
ఉభయసభల సమావేశం ప్రారంభానికి ముందు మంత్రి కేటీ రామారావు శాసనసభలోకి వచ్చి సభ్యులను కలిశారు. మజ్లిస్ సభ్యులను కలిసిన అనంతరం భాజపా సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్రావుల వద్దకు వచ్చి మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈటలను అడిగిన మంత్రి కేటీఆర్
పిలిస్తేనే కదా వచ్చేదన్న రాజేందర్
ఈనాడు, హైదరాబాద్: ఉభయసభల సమావేశం ప్రారంభానికి ముందు మంత్రి కేటీ రామారావు శాసనసభలోకి వచ్చి సభ్యులను కలిశారు. మజ్లిస్ సభ్యులను కలిసిన అనంతరం భాజపా సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్రావుల వద్దకు వచ్చి మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. కేటీఆర్ ఈటలతో మాట్లాడుతూ, ఇటీవల హుజూరాబాద్లో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదని అడిగారు. ‘మీరు పిలిస్తే కదా వచ్చేది’ అని ఈటల బదులిచ్చారు. ‘మిమ్మల్ని కూడా పిలిచినం కదా! కలెక్టర్ మీకు చెప్పలేదా?’ అని మంత్రి అడగ్గా.. ‘నాకు చెప్పలేదు కాబట్టే నేను రాలేదు. ఎమ్మెల్యేగా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమాలకూ పిలవడం లేదు. ప్రభుత్వ విధానం బాగోలేదు’ అని ఈటల అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి రఘునందన్ వస్తున్నారుకదా అని మంత్రి అన్నారు. ‘అధికారులు పిలవందే నేను ఎలా వస్తాను’ అని ఈటల బదులిచ్చారు. ఈ సంభాషణ జరుగుతుండగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారివద్దకు వచ్చారు. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవటంలేదని చెప్పారు. కేటీఆర్ నవ్వి... ‘మిమ్మల్ని పిలవని వారంటూ ఎవరూ ఉండరు’ అని వ్యాఖ్యానించారు. కాషాయ దుస్తులలో వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్తో మాట్లాడుతూ.. ‘ఎందుకో ఈ రంగు నా కళ్లకు గుచ్చుకుంటోంది’ అని సరదాగా అన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ, భవిష్యత్తులో మీరు కాషాయరంగు చొక్కా వేసుకోవాల్సి వస్తుందేమో అంటూ చమత్కరించారు. అంతకుముందు ఉపసభాపతి పద్మారావు సైతం ఈటల వద్దకు వచ్చి పలకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం