వివేకా హత్య కేసులో సీఎం దంపతులను ఏశక్తీ కాపాడలేదు: వర్ల రామయ్య
‘వివేకా హత్య జరిగిన రోజు నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిల ఫోన్ల ద్వారా భారతీరెడ్డి, జగన్మోహన్రెడ్డిలతో పదేపదే మాట్లాడానని ఎంపీ అవినాష్రెడ్డి చెప్పాక కూడా సీఎం దంపతులు తమకేమీ తెలియదని బుకాయించడం ముమ్మాటికీ పెద్ద తప్పే.
ఈనాడు, అమరావతి: ‘వివేకా హత్య జరిగిన రోజు నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిల ఫోన్ల ద్వారా భారతీరెడ్డి, జగన్మోహన్రెడ్డిలతో పదేపదే మాట్లాడానని ఎంపీ అవినాష్రెడ్డి చెప్పాక కూడా సీఎం దంపతులు తమకేమీ తెలియదని బుకాయించడం ముమ్మాటికీ పెద్ద తప్పే. వివేకా హత్య కేసు ఉచ్చునుంచి ఏ శక్తీ ముఖ్యమంత్రి దంపతులను కాపాడలేదు..’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వివేకా హత్య కేసులో తెలిసిన నిజాలను జగన్ దంపతులు సీబీఐకి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఎవరు హతమార్చారో, ఎలా చేశారో, ఎవరు చేయించారో అన్నీ వారికి తెలుసు. ఇంత తెలిశాక మౌనం వహించడం సరికాదు. హత్య జరిగిన రోజు జగన్ దంపతులతో అవినాష్రెడ్డి ఫోన్లో ఏం మాట్లాడారన్నదే కేసులో కీలకం. తాను ఎప్పుడు భారతీరెడ్డితో మాట్లాడాలన్నా నవీన్కు ఫోన్ చేస్తానని, జగన్తో మాట్లాడాలనుకుంటే ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డికి ఫోన్ చేస్తానని సీబీఐ విచారణలో ఎంపీ అవినాష్ ఇప్పటికే చెప్పారు. హత్య జరిగిన రోజు రాత్రి నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలు జగన్, ఆయన సతీమణి భారతితో ఉన్నారో, లేదో కానీ.. వారి ఫోన్లు సీఎం దంపతుల వద్దే ఉన్నాయి. నవీన్, కృష్ణమోహన్రెడ్డిలకు పదేపదే ఫోన్లు చేశానని సీబీఐ విచారణలో ఎంపీ చెప్పాక కూడా అవినాష్ తమకు ఫోన్ చేయలేదని జగన్ దంపతులు చెప్పగలరా?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్