సంక్షిప్త వార్తలు(2)
తెదేపా తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య నియమితులయ్యారు.
తుని తెదేపా ఇన్ఛార్జిగా యనమల దివ్య
ఈనాడు, అమరావతి: తెదేపా తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య నియమితులయ్యారు. రామకృష్ణుడికి వరుసకు సోదరుడయ్యే కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో తుని తెదేపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇన్ఛార్జిగా దివ్యను నియమిస్తారన్న విషయం బయటకు రావడంతో కృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కర్రోతు బంగార్రాజును, తిరుపతి జిల్లా సత్యవేడు ఇన్ఛార్జిగా హెలెన్ను అధిష్ఠానం నియమించింది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి గంటి హరీశ్మాథుర్ కన్వీనర్గా, నామన రాంబాబు కోకన్వీనర్గా ద్విసభ్య కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
10 నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు
ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ మూడో విడత క్రియాశీల సభ్యత్వ నమోదు ఫిబ్రవరి 10 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు విడతలుగా నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లే దీన్ని ఫలవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెండు విడతలుగా పార్టీ క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు, ఆరోగ్య బీమా కోసం తనవంతుగా రూ.2 కోట్ల విరాళం ఇచ్చినట్లే మూడో విడత కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...