ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
ఏపీ ఐకాస అమరావతి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ) నూతన కార్యవర్గ ఎన్నిక కర్నూలులో శనివారం జరిగింది.
కర్నూలు, న్యూస్టుడే: ఏపీ ఐకాస అమరావతి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ) నూతన కార్యవర్గ ఎన్నిక కర్నూలులో శనివారం జరిగింది. 21 మంది కార్యవర్గ సభ్యులు ఆయా పదవులకు నామినేషన్లు వేయగా, అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్గా బొప్పరాజు వెంకటేశ్వర్లు (రెవెన్యూశాఖ), ప్రధాన కార్యదర్శిగా పలిశెట్టి దామోదర్రావు (ప్రజా రవాణా), అసోసియేట్ ఛైర్మన్గా టి.వి.ఫణిపేర్రాజు (సహకార), కోశాధికారిగా వి.వి.మురళీకృష్ణనాయుడు (పీఆర్ ఇంజినీరింగ్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్.కృష్ణమోహన్రావు (మున్సిపల్ మినిస్టీరియల్) నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి కె.భావనారుషి, సహాయ ఎన్నికల అధికారి కృష్ణారావుకు అందించారు. వీరితోపాటు ప్రచార కార్యదర్శిగా బి.కిశోర్కుమార్ (కార్మిక)తోపాటు కో-ఛైర్మన్లుగా బి.విజయకుమార్, జి.ఓంకార్ యాదవ్, జి.శివానందరెడ్డి, జె.శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డి.జయధీర్, జి.సులోచనమ్మ, కె.పి.చంద్రశేఖర్, ఎస్.మల్లేశ్వరరావు, వి.అరళయ్య, రాష్ట్ర కార్యదర్శులుగా ఎ.కుమార్, ఎ.సాంబశివరావు, బీసీ శంకర్నాయక్, జి.జ్యోతి, ఆర్.వసంతరాయలు నామినేషన్ వేశారు. నూతన కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బొప్పరాజు మూడోసారి ఎన్నికయ్యారు. షెడ్యూలు ప్రకారం ఆదివారం జరిగే మూడో రాష్ట్ర మహాసభలో ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఏపీ ఐకాస అమరావతి పక్షాన పోరాడతామని, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలను సాధించుకునేందుకు పోరాటం చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్