Bhuma Akhila Priya: నంద్యాల ఎమ్మెల్యే ఇన్సైడర్ ట్రేడింగ్: భూమా అఖిలప్రియ
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి నంద్యాలలో బైపాస్ రహదారి వెళ్లే మార్గాన్ని ముందుగానే నిర్ణయించి తన లాభం కోసం 2005-07లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపి కేవలం రూ.5 లక్షలు చెల్లించి 50 ఎకరాలు కొన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు.
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి నంద్యాలలో బైపాస్ రహదారి వెళ్లే మార్గాన్ని ముందుగానే నిర్ణయించి తన లాభం కోసం 2005-07లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపి కేవలం రూ.5 లక్షలు చెల్లించి 50 ఎకరాలు కొన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆయన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. శుక్రవారం నంద్యాలలో స్థలాన్ని అఖిలప్రియ చూసి ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం ఆమెను గృహనిర్బంధం చేశారు. నంద్యాలకు వెళితే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందంటూ సీఐ జీవన్బాబు ఆమెకు నోటీసులిచ్చారు. ఆమె నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటుచేసి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా అఖిలప్రియ విలేకర్లతో మాట్లాడారు. వైద్య కళాశాల ఏర్పాటు పేరుతో ఆర్ఏఆర్ఎస్ భూములను కేటాయించి తమ భూముల విలువను మరోసారి ఎకరం రూ.10 కోట్లకు ఎమ్మెల్యే పెంచుకున్నారని అన్నారు. తన భూములను కమర్షియల్ జోన్లో ఉంచి సమీపంలోనివి మాత్రం రెసిడెన్షియల్, రిక్రియేషన్ జోన్లలో ఉంచారని తెలిపారు. నంద్యాల చుట్టుపక్కల 18 గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములున్న ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోన్గా మార్చేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారని వివరించారు. చాబోలుకుంట తవ్వి చెరువు చేస్తామంటూ బైపాస్ వద్ద ఎస్సీలకు చెందిన ఏడెకరాలను తమ మిత్రుడైన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పేరుపై రాయించిన ఘనత శిల్పా కుటుంబానిదని పేర్కొన్నారు. శిల్పా సహకార్ పేరిట 20 దుకాణాలకు కలిపి కేవలం రూ.40 వేల బాడుగ చెల్లిస్తున్నారని వివరించారు. ఒక మైనారిటీ వ్యక్తి టీ దుకాణానికి మాత్రం నెలకు రూ.22 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!