నాకు ఫోన్ కాల్స్ వస్తే... మీకు వీడియో కాల్స్ వస్తాయ్!
‘నాకు రోజుకు వంద కాల్స్ వస్తే... వాటిలో పది మంది బెదిరించేందుకు చేస్తున్నారు. అయినా భయపడకుండా అంతా వింటున్నా.
సజ్జల బెదిరింపులకు భయపడేవాణ్ని కాదు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
ఈనాడు డిజిటల్, నెల్లూరు: ‘నాకు రోజుకు వంద కాల్స్ వస్తే... వాటిలో పది మంది బెదిరించేందుకు చేస్తున్నారు. అయినా భయపడకుండా అంతా వింటున్నా. నన్ను, నా తమ్ముడిని కొట్టుకుంటూ తీసుకెళ్తానని ఎవరో కడప నుంచి అనిల్ అనే వ్యక్తితో ఫోన్ చేయించారు. అతని గురించి ఆరా తీస్తే సజ్జల కోటరీ అని తెలిసింది. ఆయనకు నేను చెప్పేది ఒక్కటే. నాకు ఫోన్ కాల్స్ వస్తే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మీకు వీడియో కాల్స్ వస్తాయని గుర్తుపెట్టుకో సజ్జల’ అని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఉదయం నెల్లూరులోని తన కార్యాలయంలో కోటంరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘వైకాపా నుంచి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లాలనుకుంటే... అధికారపార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు నా వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా’ అని తెలిపారు.
విధేయతపై కాకాణి మాట్లాడుతుంటే జాలేస్తోంది!
‘కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైకాపా వీర విధేయుడు కాదు. వేరే వాళ్లకు విధేయుడని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఆయన చెప్పింది వందశాతం నిజం. నేను కష్టాల్లో నడిచిన వ్యక్తిని. ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానే తప్ప, పక్కదారులు చూసే మనిషిని కాదు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మకద్రోహమా.? మరి మిమ్మల్ని జడ్పీ ఛైర్మన్ చేసి రాజకీయ మెట్టు ఎక్కించిన ఆనం రామనారాయణరెడ్డితో ఎందుకు విభేదించారు. వై.ఎస్. కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది. పాదయాత్రలో భాగంగా జగన్మోహన్రెడ్డి నెల్లూరుకు వస్తుంటే... నేను, భూమన కరుణాకర్రెడ్డి, శివశంకర్రెడ్డి ఎన్నిసార్లు నిన్ను కలిశామో గుర్తులేదా.. ఓదార్పు యాత్ర సమయంలో పొదలకూరులో వైఎస్ విగ్రహం పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారు కాకాణి? విధేయత గురించి మీరు మాట్లాడుతుంటే నాకు చాలా జాలేస్తోంది. వైకాపాలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది నువ్వు కాదా?’ అని గోవర్ధన్రెడ్డిపై విరుచుకుపడ్డారు.
కాకాణి.. సీబీఐ కేసు సంగతి చూసుకో!
‘మంత్రి పదవి ఇచ్చిన జగన్ కంటే... దాన్ని ఇప్పించిన ప్రభుత్వ సలహాదారుడిని అంటే కాకాణి ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే మీడియా సమావేశం పెట్టారు. ముందు నకిలీ పత్రాల కేసు సంగతి చూసుకో. నెల్లూరు కోర్టులో వేలాది ఫైళ్లుంటే... కాకాణి నిందితుడిగా ఉన్న ఫైళ్లు మాత్రమే మాయమయ్యాయి. ఆ పని నువ్వు చేశావని నేను అనలేదు. సీబీఐ అధికారులు నెల్లూరుకు వచ్చిపోతున్నారు జాగ్రత్త’ అని కోటంరెడ్డి హితవు పలికారు.
హత్యాయత్నం కేసు పెట్టుకోండి
‘నా వెంటున్న చాలామంది కార్పొరేటర్లు వెళ్లిపోతున్నారు. వాళ్ల అవసరాలు, ఇబ్బందులు చెబుతున్నారు. ఎన్నికల ముందు వస్తామంటున్నారు. 90% కార్యకర్తలు నాతో ఉంటారు. కార్పొరేటర్ విజయ భాస్కర్ను నేను బెదిరించానని, అపహరించబోయానని కేసు పెట్టించారు. అపహరణ కాదు.. హత్యాయత్నం కేసు పెట్టుకోండి. ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, విజయ్, రఘురామకృష్ణరాజులను ఎలా ఇబ్బంది పెడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సజ్జల స్థాయికి ఆంధ్ర రాష్ట్రం చాలదు. చాలా దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటికి సలహాదారుడిగా ఉంటే బాగుంటుంది’ అని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు.
శ్రీధర్ అన్నతోనే ఉంటాం: నెల్లూరు మేయర్
నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్టుడే: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితోనే ఉంటామని, ఆయన ఆదేశిస్తే సంతోషంగా తన పదవికి రాజీనామా చేస్తానని నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి స్పష్టంచేశారు. శనివారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... ‘మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాóు. ఎటు ఉంటారో ఆలోచించుకోండని సూచిస్తున్నారు. మేం శ్రీధర్ అన్నతోనే ఉంటాం’ అని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు