Nara Lokesh: నియోజకవర్గాలన్నింటికీ కలిపి.. ఒకేసారి 175 కేసులు పెట్టండి
‘యువగళం పేరిట ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నేను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ తిరుగుతా. ఒక్కోచోట ఒక కేసు కాదు.. 175 నియోజకవర్గాలకూ కలిపి ఒకేసారి 175 కేసులు పెట్టు జగన్’ అంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు.
సీఎం జగన్కు నారా లోకేశ్ సవాలు
ఈనాడు డిజిటల్, చిత్తూరు: ‘యువగళం పేరిట ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నేను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ తిరుగుతా. ఒక్కోచోట ఒక కేసు కాదు.. 175 నియోజకవర్గాలకూ కలిపి ఒకేసారి 175 కేసులు పెట్టు జగన్’ అంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. తన పాదయాత్రలో మూడు వాహనాలు, వాటితో పాటు స్టూలునూ సీజ్ చేశారని, ఇలాంటి పనులు సరికాదని హితవు పలికారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల్లో తొమ్మిదోరోజు శనివారం పాదయాత్ర చేసి.. బీసీలు, ఎస్సీలు, మహిళలు, రైతులతో ముచ్చటించారు. తన స్వగ్రామమైన తవణంపల్లె మండలం దిగువమాఘంలో మాజీమంత్రి గల్లా అరుణకుమారి.. లోకేశ్కు ఘనస్వాగతం పలికారు. అరుణకుమారి తండ్రి రాజగోపాలనాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శనివారం ఉదయం వజ్రాలపల్లిలో లోకేశ్ బసచేసిన ప్రాంతానికి పోలీసులు భారీగా తరలివచ్చారు. స్పీకర్లు ఉపయోగించకూడదని ఆదేశించారు. తెదేపా శ్రేణులు ఆ సూచనలు పాటించడంతో పాదయాత్ర ప్రశాంతంగా ముందుకు సాగింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీలకు ఆదరణ పరికరాలు ఇవ్వకపోవడంతో పాటు గతంలో కట్టిన 10% నగదూ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలు లభించకపోతే కిలోకు రూ.2 అదనంగా ఇచ్చి రైతులను ఆదుకుందన్నారు. అన్నదాతలను ఆదుకోకుంటే భవిష్యత్తులో తినడానికి గింజలు దొరకవని తెలుసుకోవాలన్నారు.
అరాచకాలను నిలదీస్తే వేధింపులా?
‘పలమనేరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేసినప్పుడు రాణెమ్మ అనే మహిళ తనకు ఇంటిపట్టా అందలేదని.. వైకాపా అరాచకాలపై ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడను నిలదీశారు. ఆమెను ఇప్పుడు వాలంటీర్లు, వైకాపా నాయకులు వేధిస్తున్నారు. అవినీతిపరులైన పోలీసులు మినహా ఆ శాఖలో మిగిలినవారంతా ఇబ్బందులు పడుతున్నారు’ అని లోకేశ్ అన్నారు.
అత్యాచారం చేసి నెలరోజుల్లో బయటకు వచ్చారు
‘ఏడేళ్ల నా మనవరాలిపై 70 ఏళ్ల వయసున్న ఓ వైకాపా కార్యకర్త అత్యాచారం చేశాడు. కేసు పెడితే పోలీసులు సరిగా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే అతణ్ని నెల రోజుల్లో జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు. అధికారంలోకి వచ్చాక మీరే మాకు న్యాయం చేయాలి’ అంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేశ్పై కేసు నమోదు
బంగారుపాళ్యం, న్యూస్టుడే: బంగారుపాళ్యంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనలతో.. లోకేశ్పై రెండు కేసులు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం సీఐ నరసింహారెడ్డి శనివారం తెలిపారు. నాలుగురోడ్ల కూడలిలో లౌడ్స్పీకర్లు పెట్టి లోకేశ్ ప్రసంగించారన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పులివర్తి నాని, దీపక్రెడ్డిలపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. బంగారుపాళ్యంలో విధుల్లో ఉన్న తనపై తెదేపా నాయకులు జయప్రకాష్నాయుడు, కోదండయాదవ్, జగదీష్, మరికొందరు హత్యాయత్నం చేశారని గంగవరం సీఐ అశోక్కుమార్ బంగారుపాళ్యం ఠాణాలో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
మార్గదర్శకాల మేరకు భద్రత: డీఐజీ రవిప్రకాష్
తిరుపతి (నేరవిభాగం), న్యూస్టుడే: లోకేశ్ యువగళం పాదయాత్ర, సభలకు సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించిన మార్గదర్శకాల మేరకు భద్రత కల్పిస్తున్నామని అనంతపురం రేంజ్ డీఐజీ ఎం.రవిప్రకాష్ పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఎక్కడా.. ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. పాదయాత్ర సాఫీగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. అసత్యప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!