YSRCP: ప్రతి ఇంటికీ జగన్‌ స్టిక్కర్‌!

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు సమన్వయంతో అర్హులందరికీ అందించాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు మేయర్‌ బీవై రామయ్య సూచించారు.

Updated : 05 Feb 2023 08:40 IST

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు సమన్వయంతో అర్హులందరికీ అందించాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు మేయర్‌ బీవై రామయ్య సూచించారు. కల్లూరు పట్టణానికి చెందిన సిబ్బందికి కర్నూలులో శనివారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే, మేయర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ స్టిక్కర్‌ అతికించాలని చెప్పారు. ఇందుకు ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని