ధైర్యముంటే నన్ను సస్పెండ్ చేయండి
‘శీనన్నతో కలసి ఉన్నారని వైరాలో కొంతమంది నా అభిమానులను స్థాయిలేని వారు భారాస నుంచి సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యం ఉంటే నన్ను సస్పెండు చేయండి’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వరం పెంచారు.
మాజీ ఎంపీ పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పోటీలో తన అభిమానులుంటారని వెల్లడి
అశ్వారావుపేట, దమ్మపేట, న్యూస్టుడే: ‘శీనన్నతో కలసి ఉన్నారని వైరాలో కొంతమంది నా అభిమానులను స్థాయిలేని వారు భారాస నుంచి సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యం ఉంటే నన్ను సస్పెండు చేయండి’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వరం పెంచారు. ముఖ్యమంత్రులు అంటే ‘ప్రజల గుండెల్లో నిలిచిన, కిలో బియ్యం రూపాయికే ఇచ్చి పేదల ఆకలి తీర్చిన ఎన్టీఆర్, గ్రామగ్రామాన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి’ అని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో సోమవారం మధ్యాహ్నం జారే ఆదినారాయణ అధ్యక్షతన పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం సాగింది. నియోజకవర్గం నుంచి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. రెండు పడకగదుల ఇళ్లు అంటూ ఎక్కడో ఒకచోట 20 ఇళ్లు నిర్మించి వాటినే పేపర్లో పెద్దపెద్ద ఫొటోలతో రాష్ట్రం మొత్తం ఇలాగే ఉందని చూపిస్తున్నారని విమర్శించారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు లేవు. నిరుపేద సర్పంచులు అనేకమంది చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక, సొంత ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో తన అభిమానులు అభ్యర్థులుగా నిలుస్తారని పొంగులేటి పేర్కొన్నారు. అశ్వారావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణను సభాముఖంగా ప్రకటించారు. సమావేశంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా