కేంద్ర బడ్జెట్.. పేదలపై దాడి: సోనియా
మోదీ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ను పేదలపై నిశ్శబ్ద దాడిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభివర్ణించారు.
దిల్లీ: మోదీ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ను పేదలపై నిశ్శబ్ద దాడిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభివర్ణించారు. యూపీఏ ప్రభుత్వం ప్రజల హక్కుల రక్షణకు చేసిన చట్టాలన్నింటినీ మోదీ సర్కారు నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మోదీకి ప్రీతిపాత్రుడైన వ్యాపారవేత్తను కుంభకోణాలు చుట్టుముడుతున్నా ప్రధాని మోదీ, ఆయన మంత్రులు విశ్వగురు, అమృత్ కాల్ అంటూ జపిస్తున్నారని ఆక్షేపించారు. ఓ ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో సోనియా.. పేద, మధ్యతరగతి ప్రజలను, చిన్న వ్యాపారులను మోదీ సర్కారు విస్మరించిందన్నారు. కొద్దిమంది ధనిక మిత్రులకు లబ్ధి చేకూర్చిపెట్టే తాపత్రయంతో పెద్ద నోట్ల రద్దు, అవకతవకల జీఎస్టీ చట్టం, వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. అమూల్యమైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో విక్రయించడం వల్ల యువతలో ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగల్లో నిరుద్యోగం పెరిగిందని తూర్పారబట్టారు. ఎల్.ఐ.సి, ఎస్.బి.ఐ.లలో ప్రజలు దాచుకున్న సొమ్మును మోదీ ప్రభుత్వ మిత్రులకు కట్టబెట్టారన్నారు. మరోవైపు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సర్వశిక్షా అభియాన్ వంటి పథకాలకు నిధులు తెగ్గోశారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?