10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

చెన్నైలో ఈ నెల పదో తేదీన 2024 ఎన్నికలపై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు.

Updated : 08 Feb 2023 06:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: చెన్నైలో ఈ నెల పదో తేదీన 2024 ఎన్నికలపై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. ఈ సదస్సుకు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ హాజరవుతారు. భారాస జాతీయ ఎజెండా, దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ఆలోచనలను ఈ వేదిక ద్వారా చాటిచెబుతామని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని