రాష్ట్రంలో భాజపా గెలుపు తథ్యం
తెలంగాణలో తమకు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమవుతున్నా భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ధీమా ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చించాలని ఆయన కోరారు.
భారాసకు తెలంగాణతో బంధం తెగిపోయింది
10వ తేదీ నుంచి 11 వేల ‘కూడలి సమావేశాలు’
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో తమకు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమవుతున్నా భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ధీమా ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చించాలని ఆయన కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడలో మంగళవారం నిర్వహించిన ‘11వేల శక్తి కేంద్రాల సభల్లో పాల్గొనే వక్తల కార్యశాల’లో బండి సంజయ్ మాట్లాడారు. కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, మాజీ మంత్రులు బాబుమోహన్, విజయరామారావు, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
‘ప్రజా గోస- బీజేపీ భరోసా’..
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘ప్రజా గోస- బీజేపీ భరోసా’ నినాదంతో 11 వేల కూడలి సమావేశా(స్ట్రీట్ కార్నర్ మీటింగు)ల ద్వారా తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సహా భాజపా అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో భాజపా ఈనెల 10 నుంచి 25 వరకు శక్తి కేంద్రాల పరిధిలో కూడలి సమావేశాలు నిర్వహించబోతోందన్నారు. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారీసభలు జరుపుతామన్నారు. తెలంగాణతో భారాసకు బంధం తెగిపోయిందని బండి సంజయ్ అన్నారు. నాందేడ్ సభలో సీఎం చెప్పిన అంశాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. కృష్ణా జలాలను ఆంధ్రకు అప్పగించారని, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవాలని గోదావరిని మహారాష్ట్రకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం