మన కృషిని ప్రజలు గుర్తిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఎన్నికల బడ్జెట్ అని ఆరోపించే ధైర్యం ఎవ్వరికీ లేదని ప్రధాని మోదీ అన్నారు.
భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఎన్నికల బడ్జెట్ అని ఆరోపించే ధైర్యం ఎవ్వరికీ లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధితో పాటు సమాజంలోని ప్రతి వర్గానికీ ఉపయుక్తంగా ఉండేలా రూపొందించామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లోనూ పేదలు, వెనకబడిన వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. దిల్లీలో మంగళవారం నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించిన మోదీ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రజల వద్దకు వెళ్లి బడ్జెట్లోని ప్రయోజనాలను, మన కృషిని వివరించాలని, వారు గుర్తిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉండదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అయినప్పటికీ.. ‘ఎన్నికల బడ్జెట్’ అని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు. సైద్ధాంతికంగా భాజపాను వ్యతిరేకించే వారు కూడా బడ్జెట్ను స్వాగతించారని ప్రధాని మోదీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులకు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు క్రీడా సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారన్నారు. క్రీడల్లో యువత ఎక్కువగా భాగస్వామ్యం కావడం లేదనే భావనతో ఈ విధంగా చెప్పారని తెలిపారు. జీ-20 సమావేశాల కోసం వస్తున్న విదేశీ అతిథులు.. ఇక్కడి ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం