బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి నిప్పు
గుంటూరులోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు.
గుంటూరు (పట్టాభిపురం, నగరంపాలెం), న్యూస్టుడే: గుంటూరులోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. పోలీసులు, అగ్నిమాపక శకటం అరండల్పేటలోని సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వాచ్మన్ నారాయణతో కలిసి అనిల్ స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ముసుగు ధరించిన ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి, తగులబెట్టారని వాచ్మన్ ఫిర్యాదు చేసినట్లు సీఐ రామానాయక్ తెలిపారు. సీసీ పుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరగా, అది పని చేయడం లేదని చెబుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు మంగళవారం విలేకరులతో బోరుగడ్డ అనిల్ మాట్లాడుతూ... ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై నేను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే శ్రీధర్రెడ్డి అనుచరులు, గుంటూరుకు చెందిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, అతని అనుచరులు నా కార్యాలయాన్ని దహనం చేశారు. అడ్డొచ్చిన మా వాచ్మన్పై పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించగా అతను పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. శ్రీధర్రెడ్డి, అతని సోదరుడు గిరిధర్రెడ్డి నన్ను అంతమొందించేందుకు కుట్ర చేశారు. వారి అనుచరుడు బాబురెడ్డి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారు’ అని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.