Botsa: వైకాపాలో వర్గపోరు.. బావాబామ్మర్దులు X బొత్స కుటుంబం
నెల్లిమర్లలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు కుటుంబం మధ్య స్పర్థలు చోటుచేసుకోవడంతో నియోజకవర్గంపై ఎవరికి వారు పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లానెల్లిమర్ల వైకాపాలో వర్గపోరు ఎక్కువగా ఉంది. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు కుటుంబం మధ్య స్పర్థలు చోటుచేసుకోవడంతో నియోజకవర్గంపై ఎవరికి వారు పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను.. ఎమ్మెల్యే అప్పల నాయుడు బావాబామ్మర్దులు. త్వరలో వియ్యంకులు కాబోతున్న ఈ నేతలిద్దరూ ఇప్పుడు ఒకటిగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేసేందుకు మంత్రి బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణరావు, ఆయన తనయుడు నియోజకవర్గంలో పట్టు సాధించే పనిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అప్పల నాయుడు నిలిపిన సర్పంచి అభ్యర్థులకు వ్యతిరేకంగా 5 చోట్ల లక్ష్మణరావు తన మద్దతుదారులను బరిలో దింపి 3 చోట్ల గెలిపించుకున్నారు. నెల్లిమర్లలో స్థానిక పార్టీ నాయకులు పలువురు మంత్రి బొత్సకు సహచరులు, అనుయాయులున్నారు. దీంతో ఎమ్మెల్యే అక్కడ కార్యక్రమాలను తగ్గించుకుని, నియోజకవర్గంలోని ఇతర మండలాలపై దృష్టి పెట్టారు. ‘మీ తమ్ముడు నా నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మీరు నియంత్రించకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తా’ అంటూ మండల పరిషత్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బహిరంగంగానే మంత్రి బొత్సను హెచ్చరించారు.
ఇటీవల అప్పల నాయుడి కుమారుడి వివాహానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ను బొత్స కుటుంబ సభ్యులు హెలిపాడ్వద్దే కలిసి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. బొత్స మద్దతిచ్చే ఎమ్మెల్సీ పెన్మత్స సూర్యనారాయణ రాజు (సురేష్) పదవీ కాలం మార్చిలో ముగియనుంది. ఆయనకు ఆ పదవిని రెన్యువల్ చేయకుండా 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన కందుల రఘుబాబుకు ఇస్తే పార్టీ బలోపేతమవుతుందని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఎవరికివారు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి ప్రకటించింది. -
కాంగ్రెస్లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు
భారాస నేతలు, 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరినట్టు చంపాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి తెలిపారు. -
నవనీత్ రాణాకు భాజపా టికెట్ .. ఆ సీటు నుంచే బరిలోకి..
సినీనటి, అమరావతి నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన నవనీత్ రాణా ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. -
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పోటీ చేయనున్న 10 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో తెలుగుదేశం పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. -
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
మథురలో ప్రజలు నరేంద్రమోదీ ప్రభుత్వానికే పట్టం కడతారని నటి, భాజపా ఎంపీ అభ్యర్థి హేమమాలిని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భాజపా విడుదల చేసింది. -
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
జనసేన పెండింగ్ స్థానాలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు కొనసాగుతోంది. -
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ షోకాజ్ నోటీసులు
భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి: చంద్రబాబు
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్పై నేను చెప్పిందే నిజమైంది: రఘునందన్రావు
తెలంగాణలో రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీకి భాజపా నేత రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. -
సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్ వర్గం, కాంగ్రెస్ మధ్య ‘కిచిడీ’ చిచ్చు
ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం నేతపై కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోదీ ఫోన్
భాజపా అభ్యర్థి రాజమాత అమృతారాయ్ (Amrita Roy)తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ (Modi).. దేశంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
వైకాపా డంప్లు బట్టబయలైనా చర్యలేవీ?: అచ్చెన్నాయుడు
రేణిగుంట ఎఫ్సీఐ గోదాం వద్ద వైకాపా నేతల నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్: కేటీఆర్
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే: చంద్రబాబు
వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. -
వీహెచ్కు బుజ్జగింపులు.. అండగా ఉంటానని సీఎం రేవంత్ భరోసా
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. -
సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చల వేళ.. ఉద్ధవ్ పార్టీ తొలి జాబితా విడుదల
Shiva Sena (UBT): శివసేన (యూబీటీ) పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. -
ఆ కంటెయినర్లో ఏముంది?బ్రెజిల్ సరకా.. మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా?: నారా లోకేశ్
రోజూ తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రశ్నించారు. -
చీరాల వైకాపాలో ముసలం
బాపట్ల జిల్లా చీరాల వైకాపాలో ముసలం రేగింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
నా ఫోన్నూ ట్యాప్ చేశారు: బండి సంజయ్
గత భారాస ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
2030 నాటికి విమాన సర్వీసులు డబుల్..
-
ఉప్పల్లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన