Nara Lokesh: పన్నుల వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం
‘వైకాపా పాలనలో రాష్ట్రంపై అప్పుల భారం పెరిగింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలూ ఇక్కడే అధికంగా ఉన్నాయి. పన్నులూ ఇలాగే విధిస్తున్నారు.
అధికారంలోకి రాగానే నిత్యావసరాల ధరల తగ్గింపు
‘యువగళం’ పాదయాత్రలో నారా లోకేశ్ హామీ
ఈనాడు డిజిటల్, చిత్తూరు: ‘వైకాపా పాలనలో రాష్ట్రంపై అప్పుల భారం పెరిగింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలూ ఇక్కడే అధికంగా ఉన్నాయి. పన్నులూ ఇలాగే విధిస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల విధానాన్ని ప్రక్షాళన చేస్తాం. ఆకాశన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో పాటు ఇసుక, సిమెంటు రేట్లు తగ్గిస్తాం’ అని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి, ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచితే రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందని.. తెదేపా అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని అవలంబిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘యువగళం’లో భాగంగా 13వ రోజైన బుధవారం చిత్తూరు మండలంలో లోకేశ్ పాదయాత్ర చేశారు. సాయంత్రానికి యాత్ర చిత్తూరులో ముగిసి గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
మరింత పకడ్బందీగా సచివాలయ వ్యవస్థ
‘తెదేపా అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులను తొలగిస్తామని కొందరు అంటున్నారు. ఇది నిజం కాదు. వ్యవస్థను మరింత పకడ్బందీగా రూపొందించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే నైపుణ్యాలతో కూడిన విద్యావ్యవస్థను ప్రవేశపెడతాం. తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్లానికీ ప్రోత్సాహం ఇస్తాం. నా కుమారుడు దేవాన్ష్ను తెలుగు సబ్జెక్టు ఉన్న పాఠశాలలో చేర్పించాను. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలంటే పదేళ్లు చాలు. దశాబ్దం పాటు తెదేపాకు ప్రజలు అధికారమిస్తే రాష్ట్ర దశ, దిశ మారుస్తాం. రైతన్న రాజ్యం తీసుకువస్తానని పాదయాత్రలో చెప్పిన జగన్.. నేడు రైతులు లేని రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలని కంకణం కట్టుకున్నారు. మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి అప్పట్లో పాదయాత్ర చేసిన జగన్.. నేడు వారికి మరిన్ని కష్టాలు తెచ్చారు. ఇప్పుడాయన అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఆనాడు పాదయాత్ర చేసిందీ.. ఇప్పుడు సీఎంగా ఉన్నదీ ఒకరేనా అనిపిస్తోంది’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు.
ప్రసంగానికి అనుమతి నిరాకరణ..
చిత్తూరు మండలం ఎన్ఆర్పేట కూడలిలో లోకేశ్ మాట్లాడేందుకు సమాయత్తమవ్వగా ప్రసంగించేందుకు అనుమతి లేదంటూ చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి.. లోకేశ్తోపాటు మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబులను అడ్డుకున్నారు. సుమారు 15 నిమిషాలపాటు చిత్తూరు- తిరుత్తణి రోడ్డుపై హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో డీఎస్పీపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 1 ప్రకారం రోడ్లపై సమావేశం నిర్వహించడానికి అనుమతి లేదని అంతకుముందు పోలీసులు చెప్పగా ప్రత్యాయ్నాయ స్థలం చూపాలని తెదేపా నాయకులు కోరారు. సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సభ జరుపుకోవాలని పోలీసులు చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదు. జగన్ రోడ్లపై సభలు పెట్టారని, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, వైకాపా ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి ఇటీవల రహదారులపై సమావేశాలు పెట్టారు కదా అని లోకేశ్ గుర్తుచేశారు. ఎవరికీ లేని ఆంక్షలు లోకేశ్కే అమలవుతాయా? అన్నారు. ఒకానొక దశలో పోలీసులు, తెదేపా వర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు 10 అడుగుల దూరం వెళ్లి ప్రజలతో మాట్లాడవచ్చని లోకేశ్కు డీఎస్పీ చెప్పడంతో తెదేపా శ్రేణులు అక్కడకు వెళ్లాయి. అప్పుడు కూడా మైకును లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నించగా స్టూల్పై నిలబడిన లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవనం.. పోలీసుల ఆధీనం
చిత్తూరు గ్రామీణ మండలంలోని ఎన్ఆర్పేటలో బుధవారం లోకేశ్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇంతకుముందు బంగారుపాళ్యంలో అనుమతి ఇవ్వకపోవడంతో లోకేశ్ ఓ భవనం ఎక్కి ప్రసంగించారు. ఇక్కడా అలాగే భవనం ఎక్కుతారేమోనని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్ఆర్పేటలో పలు భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలు భవనాలపై మోహరించారు. దీంతో చేసేది లేక లోకేశ్ ఓ స్టూల్ ఎక్కి ప్రసంగించి వెళ్లిపోయారు.
ఈనాడు, చిత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు