నిధులు రావని తెలిసీ భారీ బడ్జెట్టా?
రాష్ట్ర ఆవిర్భావం నుంచి గత బడ్జెట్ వరకు ప్రతిపాదించిన మొత్తంలో 70-80 శాతానికి మించి ఖర్చు ఉండటం లేదని.. అయినా ఈసారీ అదే తప్పు చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
అన్యాయం చేస్తోందని కేంద్రాన్ని నిందించడం తప్పు: ఈటల రాజేందర్
ఈనాడు, హైదరాబాద్, గాంధీభవన్, న్యూస్టుడే: రాష్ట్ర ఆవిర్భావం నుంచి గత బడ్జెట్ వరకు ప్రతిపాదించిన మొత్తంలో 70-80 శాతానికి మించి ఖర్చు ఉండటం లేదని.. అయినా ఈసారీ అదే తప్పు చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 2021-22లో రూ.2.21 లక్షల కోట్ల బడ్జెట్లో ఖర్చు చేసింది రూ.1.75 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలకు సంబంధించి ఒకే విధానం ఉంటుందని.. అయినా రాష్ట్రానికి భాజపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘భూముల విక్రయంతో రూ.16 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. గతేడాది అది రూ.3 వేల కోట్లకు మించలేదు. స్పెషల్ అసిస్టెన్స్ అని రూ.25 వేల కోట్లు చూపుతున్నారు. నిరుడు ఒక్కపైసా రాలేదు. మొత్తమ్మీద తాజా బడ్జెట్లో పేర్కొన్న రూ.55 వేల కోట్ల నిధుల్లో ఒక్కపైసా రాదు. మరి రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు?
దళితబంధు ఖర్చు రూ.4,440 కోట్లేనా?
దళితులందరికీ దళితబంధు పథకం అందాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. గత బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించి.. చివరకు రూ.4,440 కోట్లే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు చూపారు. ఇప్పటికీ చాలామందికి మొదటి వాయిదా మాత్రమే అందింది. 2018 ఎన్నికల సందర్భంగా పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ 35 లక్షల మంది ఎదురుచూస్తున్నారు’’ అని ఈటల అన్నారు.
అల్పాహారం తినేందుకూ గది లేదు..
శాసనసభలో భాజపాకు గది కేటాయించకపోవడంపై ఈటల రాజేందర్, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు అల్పాహారం తినేందుకు కూడా గది లేదని అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలం ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలని ప్రశ్నించారు. దీనిపై మంత్రి హరీశ్రావు స్పందిస్తూ.. కనీసం అయిదుగురు సభ్యులు ఉంటేనే గది కేటాయించాలన్న సంప్రదాయం ఉందని చెప్పారు. బడ్జెట్పై సూచనలు ఇచ్చే బదులు గది గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్యాదవ్ జోక్యం చేసుకుంటూ.. ఈ విషయమై స్పీకర్ను కలిసి విన్నవించాలని, వాగ్వాదం ఎందుకని ప్రశ్నించారు. సభాపతిని ఆరుసార్లు కలిసినా ప్రయోజనం లేదని రాజేందర్ పేర్కొన్నారు.
రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదో సమాధానం చెప్పి, ముక్కు నేలకు రాయాలని సీఎం కేసీఆర్ను ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ‘‘విశ్వవిద్యాలయాలను సాంఘిక సంక్షేమ వసతిగృహాల కంటే దారుణంగా మార్చేశారు. ఇది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారు’’ అని అసెంబ్లీ మీడియా పాయింట్లో ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి