జగన్.. ఈ ప్రశ్నలకు జవాబుందా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు కావాలంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారు?
‘జగనాసుర రక్త చరిత్ర బహిరంగం’ పుస్తకం విడుదల చేసిన తెదేపా
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు కావాలంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారు?
ఈ కేసులో నిందితుడైన వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని ఇప్పటివరకూ పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదు? తాడేపల్లి ప్యాలెస్ కుట్రలు గుట్టురట్టవుతాయని భయమా?
కడప కారాగారంలో రిమాండులో ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని కోర్టు అనుమతి లేకుండా.. కడప రిమ్స్ ఆసుపత్రికి ఎలా తరలించారు? జగన్మోహన్రెడ్డి అండ లేకుండా ఇది సాధ్యమా?
వివేకా హత్యానంతరం వేకువజామున 3 గంటలకు భారతి పీఏ నవీన్కు అవినాష్రెడ్డి ఎందుకు ఫోన్ చేశారు? భారతి ఆ సమయంలో అవినాష్తో ఏం మాట్లాడారు? కాల్ డేటా ఎందుకు బహిర్గతం చేయడం లేదు?
వైఎస్ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయంటూ మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించిన ‘జగనాసుర రక్త చరిత్ర బహిరంగం’ పుస్తకంలో సంధించిన ప్రశ్నలివి..
ఈనాడు, అమరావతి: సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాలు, వివేకా కుమార్తెతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు, అప్రూవర్ దస్తగిరిలు ఇచ్చిన వాంగ్మూలాలు, ఇతర ఆధారాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెదేపా ఆరోపించింది. సీబీఐ.. రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా ఈ హత్యలో సూత్రధారులైన బడానేతల్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని డిమాండు చేసింది. ‘‘కీలక వ్యక్తుల’’ పాత్రపై అనేక ఆధారాలు ఉన్నా వారి అరెస్టు విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ‘‘జగనాసుర రక్తచరిత్ర బహిరంగం’’ పేరిట శుక్రవారం పుస్తకాన్ని విడుదల చేసింది. ‘జగన్రెడ్డి నరహంతక పాలనకు.. చరమగీతం పాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..’’ అని అందులో పేర్కొంది. వివేకా హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ చోటుచేసుకున్న పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలు, సీబీఐకి వైఎస్ కుటుంబీకుల వాంగ్మూలాలు తదితర వివరాలన్నీ ప్రస్తావించింది. వాటి ఆధారంగా జగన్కు సూటిగా పలు ప్రశ్నలు సంధించింది. ప్రధానాంశాలివి.
* వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్కు అధిపతిగా అదనపు డీజీపీ స్థాయి అధికారి వ్యవహరిస్తుండగా... జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిట్ అధిపతిగా ఎస్పీ స్థాయి అధికారికి ఎందుకు బాధ్యతలు అప్పగించారు?
* అవినాష్రెడ్డి అనుచరుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని విచారించేందుకు సిట్ అధికారి అభిషేక్ మహంతి ఆయన్ను కడప తీసుకెళ్తుండగా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మహంతికి ఫోన్ వెళ్లిందా? లేదా? ఆ తర్వాత ఉదయ్కుమార్రెడ్డిని వెనక్కి పంపించేయడం వాస్తవం కాదా? ఇది జరిగిన తర్వాత మహంతిని దీర్ఘకాలిక సెలవుపై ఎందుకు పంపించేశారు?
* జగన్ ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఎందుకు వచ్చింది? ఎర్ర గంగిరెడ్డిపై రాష్ట్ర పోలీసులు ఎందుకు ఛార్జీషీట్ వేయలేదు?
* సీఐ శంకరయ్య తొలుత మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడి.. ఆ తర్వాత ఎందుకు ముఖం చాటేశారు? ఆయన అలా చేసిన వారం రోజుల వ్యవధిలోనే సస్పెన్షన్ ఎత్తేసి, పోస్టింగు, పదోన్నతి ఇవ్వడంలో ఆంతర్యమేమిటి? ముఖ్యమంత్రి కార్యాలయం ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యమా?
జగన్, భారతి ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
* హత్య జరిగిన రోజు రాత్రి ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి ఫోన్ ద్వారా జగన్తో అవినాష్రెడ్డి పదే పదే మాట్లాడారు. నవీన్, కృష్ణమోహన్రెడ్డిల ఫోన్ల బాగోతం బహిర్గతమైన తర్వాత జగన్, భారతి ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
* కడప లోక్సభ టిక్కెట్ కోసం శివశంకర్రెడ్డి ద్వారా అవినాష్రెడ్డియే వివేకాను చంపించారనే అనుమానం ఉందంటూ సీబీఐ కోర్టు అఫిడివిట్లోనే పేర్కొంది.
* సీబీఐ అధికారిపైనే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అంతఃపుర ఆదేశం లేకుండా ఇది సాధ్యమా?
* దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల తరఫున ఉన్నత న్యాయస్థానాల్లో వాదిస్తున్న అతి ఖరీదైన న్యాయవాదులకు రూ.కోట్ల ఫీజులు ఎవరు చెల్లిస్తున్నారు?
ప్రమేయం లేకపోతే సీఐని ఎందుకు బెదిరించారు?
* గొడ్డలివేటును గుండెపోటుగా విజయసాయిరెడ్డి చేత చెప్పించారు. అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్రెడ్డిల ఆధ్వర్యంలో ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేశారు.
* ఎంపీ అవినాష్రెడ్డికి సన్నిహితుడైన గజ్జల జయప్రకాశ్రెడ్డి సాయంతో వివేకా భౌతికకాయంపై రక్తాన్ని తుడిచేసి.. గాయాలకు బ్యాండేజి కట్టారు. ప్రజలకు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పూలతో అలంకరించి ఫ్రీజర్ బాక్సులో పెట్టారు.
* హత్య గురించి తెలిసిన వెంటనే జగన్ వెళ్లకుండా సాయంత్రం వరకూ ఎందుకు జాప్యం చేశారు?
* హత్యలో ప్రమేయం లేకపోతే వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని, శరీరంపై ఉన్న గాయాల గురించి మాట్లాడవద్దని సీఐ శంకరయ్యను అవినాష్రెడ్డి ఎందుకు బెదిరించారు?
సాక్షుల అనుమానాస్పద మరణాలు
కేసులో కీలక సాక్షులైన కె.శ్రీనివాసరెడ్డి, గంగాధర్రెడ్డిలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భారతి తండ్రి డా.ఈసీ గంగిరెడ్డి కూడా చనిపోయారు. ఇవన్నీ మిస్టరీగానే మిగిలాయి. గతంలో పరిటాల రవి హత్యకేసులో సాక్షుల విషయంలోనూ ఇలానే జరిగింది.
‘మా మామ హత్యకు జగనే పథకాన్ని రచించి ఉంటారు’
వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి, కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో వివేకా హత్య ఎందుకు జరిగిందో ఉంది. వారిచ్చిన వాంగ్మూలిలా ఉన్నాయి.
* ‘‘కోడికత్తి దాడి లాగే.. ఎన్నికల్లో గెలవడానికి మా మామ హత్యకు జగనే పథకాన్ని రచించి ఉంటారు. వివేకా హత్యలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని మొదట్లో మేము అనుమానించలేదు. అప్పట్లోనే సందేహించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాష్రెడ్డి ఓడిపోయేవారు..’’
వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి
* ‘‘హంతకులు ఎవరో తేల్చాలని జగన్ను కోరా. అనుమానితుల పేర్లూ చెప్పా. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సవాల్ చేశా. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది? అవినాష్రెడ్డి భాజపాలో చేరుతారు. అతనికేమీ కాదు. నాపై ఉన్న 11 కేసులకు మరొకటి తోడై 12 కేసులవుతాయని జగన్ మాట్లాడటం నన్ను బాధించింది.
వివేకా కుమార్తె సునీతారెడ్డి
* ‘‘కడప లోక్సభ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వకపోతే.. షర్మిల లేదా విజయలక్ష్మికి మాత్రమే టికెట్ ఇవ్వాలని జగన్ను వివేకానందరెడ్డి కోరారు. ఇది వాస్తవం. కడప లోక్సభ టికెట్ కోసమే మా బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇది మా కుటుంబంలో జరిగిన ఘోరం.
జగన్ సోదరి షర్మిల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
₹1,823 కోట్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. శనివారం (మార్చి 30న) దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరింది. -
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి