BRS: భారాసలోకి విజయవాడ మాజీ మేయర్‌

విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల గురువారం భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు.

Updated : 24 Feb 2023 07:07 IST

గుంటూరు (గోరంట్ల), విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల గురువారం భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రి, పలువురు మైనారిటీ నాయకులు భారాస రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్‌గా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్‌, తెదేపాల్లోనూ కొంతకాలం పని చేశారు. ప్రస్తుతం వైకాపాలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని