BRS: భారాసలోకి విజయవాడ మాజీ మేయర్
విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల గురువారం భారత్ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు.
గుంటూరు (గోరంట్ల), విజయవాడ సిటీ, న్యూస్టుడే: విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల గురువారం భారత్ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రి, పలువురు మైనారిటీ నాయకులు భారాస రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్గా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్, తెదేపాల్లోనూ కొంతకాలం పని చేశారు. ప్రస్తుతం వైకాపాలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.