2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాలి
రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న రెండు లక్షల వరకు ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ‘ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు.
పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న రెండు లక్షల వరకు ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ‘ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే 10 వేల పోస్టులతో క్యాలెండర్ ప్రకటించారు. 2004 సెప్టెంబరు కంటే ముందు ఉద్యోగాలకు ఎంపికై.. ఆ తర్వాత నియామకం పొందిన వారికి కేంద్రం పాత పింఛను విధానాన్ని వర్తింపజేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
* రాష్ట్రంలో వివిధ అంశాలపై పీడీఎఫ్, వైకాపాకు చెందిన ఎమెల్సీలు, ఎమ్మెల్యేలు తమ గళాన్ని వినిపించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు.
తప్పుడు సమాచారమిస్తున్నారు
‘మండలిలో ప్రశ్నలు అడిగితే రికార్డుల్లో దొరక్కుండా ఉండేలా మంత్రులు అంతా బాగున్నట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కోనసీమ జిల్లాలో కొన్ని వేల టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉంటే లక్ష్యం పూర్తయిందని.. ఇక కొనుగోలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. రైతు అండగా ఉండడమంటే ఇదేనా? పోలీసులకు టీఏలు, ఈఎల్స్ బకాయిలు చెల్లించడం లేదు. వారాంతపు సెలవు అమలు కావడం లేదు.’
ఐ.వెంకటేశ్వరరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
పులివెందుల ఒక్కటే ప్రత్యేకమా?
‘పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలోని వైఎస్ రాజారెడ్డి జూనియర్ కళాశాలలో పనిచేసే అన్ఎయిడెడ్ అధ్యాపకుల్ని కాంట్రాక్ట్ విధానంలో తీసుకుని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోని వారిని పొరుగు సేవల కింద తీసుకోవడం ఏంటి? రాష్ట్రంలోని అన్ఎయిడెడ్ అధ్యాపకుల్ని అందరినీ కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకుని మినిమమ్ టైం స్కేల్ను వర్తింప చేయాలి. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల్ని ఎప్పడు భర్తీ చేస్తారని అడిగితే ప్రభుత్వం సరిగా సమాధానమివ్వడం లేదు.’
షేక్ సాబ్జీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
జగన్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు
‘ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దళారుల బెడద లేకుండా 22 పథకాల సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పేదలకు పథకాలు అందుతున్న తీరు చూసి వైకాపా ఎమ్మెల్యేగా కంటే పౌరునిగా ఎక్కువ సంతోషపడుతున్నా. ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాల్సిన అవసరముంది.’
వరప్రసాద్, వైకాపా ఎమ్మెల్యే
ప్రగతి శీల బడ్జెట్
’2023-24 బడ్జెట్ ప్రగతి శీల బడ్జెట్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది. మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి రూ.77 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్ను వ్యతిరేకిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం దుర్మార్గం. వారు ప్రజా ప్రయోజనాల్ని పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు.’
పోతుల సునీత, వైకాపా ఎమ్మెల్సీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. -
కలిసి పనిచేయడానికి అంగీకారం
పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. -
భాజపా ఓటమే సీపీఎం లక్ష్యం: బీవీ రాఘవులు
మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. -
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం