వైకాపాకు చెంపదెబ్బ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బని, ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రం అంతా కనిపిస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం (వన్టౌన్), న్యూస్టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బని, ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రం అంతా కనిపిస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘గత సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించిన వైకాపాకు... ఇప్పుడు 30 శాతానికి ఓట్లు పడిపోయాయి. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాందిగా నిలుస్తుంది. 2024లో తెదేపా తప్పక విజయం సాధిస్తుంది. రాజధాని సహా వైకాపా ప్రభుత్వం చెప్పిన మాటలపై ప్రజలకు విశ్వాసం లేదు...’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైందని గంటా చెప్పారు.
తెదేపా విజయానికి తొలిమెట్టు: సోమిరెడ్డి
నెల్లూరు(స్టోన్హౌస్పేట), న్యూస్టుడే : 2024 ఎన్నికల్లో తెదేపా విజయానికి తొలిమెట్టుగా ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధిస్తోందని చెప్పారు.
పులివెందులలో తెదేపాను ఆదరించారు
‘‘సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో పట్టభద్రులు తెదేపాను ఆదరించారు. దీనికి జగన్ ఏం సమాధానం చెప్పి తప్పించుకుంటారు? ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా గెలుపుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాంల... పశ్చిమ, తూర్పు రాయలసీమల్లో ముందంజపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెబుతారు?’’ అని మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ నిలదీశారు. దమ్ముంటే మంత్రులు, స్పీకర్ వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల ఫలితాల్ని బట్టి మేధావులు, చదువుకున్న వారు జగన్ను నమ్మడం లేదని తేలిపోయిందన్నారు.
జలీల్ఖాన్, మాజీ ఎమ్మెల్యే
దోపిడీ తప్ప అభివృద్ధి లేదని ప్రజలకు అర్థమైంది
‘‘జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అని ప్రజలకు అర్ధమై పోయింది. రాష్ట్రాన్ని జగన్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. మూడు రాజధానులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ప్రజలు గుర్తించారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు ఒకేలా స్పందించారు. పెట్టుబడుల సదస్సు, రాజధాని, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతా ఉత్తుత్తి మాటలేనని వారికి అర్థమైంది. వైకాపా పాలనలో సామాన్యులు మరిన్ని సమస్యలు, కష్టాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారంతా తెదేపాకే పట్టం కడతారు’’
పల్లా శ్రీనివాసరావు, తెదేపా విశాఖ జిల్లా అధ్యక్షుడు
వైకాపా అభ్యర్థులను ఓడించిన నిరుద్యోగ యువత
‘‘ఏటా జాబ్ క్యాలండర్, మెగా డీఎస్సీ అనే మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన వైకాపా.. నిరుద్యోగుల్ని గాలికొదిలేసింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయని నేపథ్యంలో ప్రజలు వైకాపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు. నిరుద్యోగులు తిరుగులేని దెబ్బకొట్టారు. ఇంకా మిగిలింది 2024 ఎన్నికలే’’
షేక్ సిద్ధిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత