సీఎం దిల్లీ పర్యటన రహస్యమేంటి?
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిల్లీ పర్యటనపై చర్చకు అనుమతించాలని తెదేపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి అనుమతించకపోవడంతో శాసనసభ అయిదోరోజు సమావేశాలు శనివారం వాడివేడిగా మొదలయ్యాయి.
ఆయన సొంత ప్రయోజనాలకా.. రాష్ట్రం కోసమా?
చర్చకు పట్టుబట్టిన తెదేపా ఎమ్మెల్యేలు
వాయిదా తీర్మానాన్ని అనుమతించని స్పీకర్పై ఎజెండా కాపీలు చించి విసిరిన సభ్యులు
11 మంది తెదేపా సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేసిన సభాపతి
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిల్లీ పర్యటనపై చర్చకు అనుమతించాలని తెదేపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి అనుమతించకపోవడంతో శాసనసభ అయిదోరోజు సమావేశాలు శనివారం వాడివేడిగా మొదలయ్యాయి. చర్చకు అనుమతించాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభలో కొద్దిసేపు అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. చివరకు 11 మంది తెదేపా సభ్యులను ఒకరోజు పాటు సభాపతి తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభ మొదలవ్వగానే సభాపతి సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టడంతో తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడితో పాటు ఎమ్మెల్యేలు సీఎం దిల్లీ పర్యటనపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని కోరారు. సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించడంతో ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. చర్చకు అనుమతించాలని సభాపతి పోడియంను చుట్టుముట్టి నినాదాలిచ్చారు. స్పీకర్ వద్దకు వెళ్లి ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. ఎజెండాను చించి సభాపతిపైకి విసరడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా గౌరవం పాటించకుండా.. సభాపతిపైకి కాగితాలు విసరడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభాపతికి సూచించారు. తెదేపా సభ్యులపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సీహెచ్ జగ్గిరెడ్డి, కె.శ్రీనివాస్, ధర్మశ్రీ, మధుసూదన్రెడ్డి అన్నారు. ప్రజాధనంతో దిల్లీ వెళ్లిన సీఎం తన పర్యటన వివరాలు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలను ఒక రోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, మరికొందరు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబు పర్యటనలపై చర్చిద్దామా?: బుగ్గన
సీఎం హోదాలో చంద్రబాబు 30సార్లు దిల్లీ వెళ్లారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. వీటిపైనా సభలో చర్చిద్దామా? అని తెదేపా సభ్యులను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశాక, అంతకుముందు రాజేంద్రనాథరెడ్డి సభలో మాట్లాడారు. ‘రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకే సీఎం దిల్లీ వెళుతున్నారు. సీఎం దిల్లీ పర్యటనపై చర్చకు వాయిదా తీర్మానం ఇవ్వడం దేశచరిత్రలో లేదు. వాయిదా తీర్మానాన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తున్నారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై తెదేపా సభ్యులు స్పందిస్తూ... చంద్రబాబు దిల్లీ పర్యటనపై చర్చకు సిద్ధమేనన్నారు.
కళంకితుడిగా ఉండదలుచుకోలేదు: సభాపతి
తెదేపా సభ్యులు సభలో బాధ్యతారహితంగా వ్యవహరించారని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. తెదేపా సభ్యుల సస్పెన్షన్ తర్వాత పలువురు వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడాక సభాపతి ప్రతిస్పందించారు. ‘తెదేపా సభ్యులు ఎలా వ్యవహరించినా.. నేను సభను బాధ్యతగా నడిపించాలి కదా.. చరిత్రలో కళంకితుడిగా ఉండదలుచుకోలేదు’ అని సభాపతి అన్నారు.
పేకప్... పేకప్ వ్యాఖ్యలు
సభాపతి సస్పెండ్ చేశాక తెదేపా సభ్యులు సభనుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి వైకాపా ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ‘పేకప్ ..పేకప్’ అన్నారు. దీనిపై తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ‘ఎన్నికల్లో మీ ఎమ్మెల్సీలు పేకప్.. 2024 ఎన్నికల్లో మీరూ పేకప్’ అంటూ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. -
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది.