తెలంగాణలోని సామెతను మాత్రమే ప్రస్తావించా!
భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు.
మరో ఉద్దేశం లేదు
మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చిన బండి సంజయ్
రెజిమెంటల్బజార్, గన్ఫౌండ్రి, న్యూస్టుడే: భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. శనివారం భాజపా లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్ మార్చి 15న కమిషనర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఆ రోజు రాలేనని, ఈనెల 18న హాజరవుతానని వెల్లడించారు. ఈమేరకు ఆయన శనివారం కమిషన్ ముందు హాజరై వివరణనిచ్చారు. ఉదయం 11.10 గంటలకు లోపలికి వెళ్లిన సంజయ్ మధ్యాహ్నం 1.45కు బయటకు వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..‘‘మహిళా కమిషన్ నోటీసులకు సమాధానమిచ్చాను. అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయి వివరణ ఇచ్చా. తెలంగాణలోని సామెతను మాత్రమే ప్రస్తావించాను తప్ప మరో ఉద్దేశం లేదు. రాష్ట్రంలో పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని మంత్రి కేటీఆర్ కామన్సెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి కామన్సెన్స్ ఉందో.. ఎవరికి లేదో ప్రజలకు తెలుసు’’ అని అన్నారు. తనపైౖ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లు తాను భావించడం లేదని... అయితే జరుగుతున్న ప్రచారంపై కమిషన్ వివరణ ఇవ్వాలని కోరారు.
పేపరు లీక్పై విచారణకు అభ్యంతరమేంటి?
బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేపర్ లీక్ కేసులో తప్పు జరగనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి అభ్యంతరం ఎందుకు? అని ప్రశ్నించారు. ‘‘అభ్యర్థులు రోడ్కెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినపుడు.. ఈడీ, సీబీఐ రాజ్యాంగ సంస్థలు కాదా? పేపర్ లీక్ కేసులో అరెస్టయిన రేణుక కుటుంబం బీఆర్ఎస్లో ఉంది. నిందితుడు పదేళ్లుగా మీ దగ్గరే పనిచేస్తున్నపుడు ఎందుకు పట్టుకోలేకపోయారు. రాజశేఖర్ విషయంలో కమిషన్ ఇన్నాళ్లు ఏం చేసింది. టీఎస్పీఎస్సీని రద్దుచేసే అధికారం సీఎంకు లేనప్పుడు.. రద్దుచేసే అధికారం ఉన్నవారికి లేఖ ఎందుకు రాయడం లేదు’’ అని అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భాజపా ప్రమేయం ఉంటే నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. సంజయ్ వెంట భాజపా మహిళా మెర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, కార్పొరేటర్లు దీపిక, సుచిత్ర, సరళ తదితరులు ఉన్నారు. అనంతరం సిద్దిపేటలో మాట్లాడుతూ..పేపర్ లీకేజీలో ఓ విశ్రాంత ప్రధాన అధికారి సూత్రధారి అని ఆరోపించారు. గతంలో సింగరేణి పేపర్ లీకేజీకి కూడా అతనే బాధ్యుడు అన్నారు. దీనిపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM