2024లో ప్రాంతీయ పార్టీలే కీలకం
రానున్న కొద్ది రోజుల్లో ప్రతిపక్ష కూటమి ఒక రూపు సంతరించుకోనుందని, 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని, భాజపా ఓటమి తమతోనే సాధ్యమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
త్వరలో కూటమికి ఒక రూపు
చేరాలో వద్దో కాంగ్రెస్ ఇష్టం
అఖిలేశ్ యాదవ్ స్పష్టీకరణ
కోల్కతా: రానున్న కొద్ది రోజుల్లో ప్రతిపక్ష కూటమి ఒక రూపు సంతరించుకోనుందని, 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని, భాజపా ఓటమి తమతోనే సాధ్యమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. తమ కూటమిలో చేరాలో వద్దో తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. శనివారం ఓ వార్తాసంస్థకు ఆయన వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ప్రతిపక్ష కూటమి ఏర్పాటుపై జరుగుతున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ముఖ్యమంత్రులు నీతీశ్ కుమార్, మమతా బెనర్జీ, కేసీఆర్లు ఈ విషయంలో కృషి చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఇది ఒక కొలిక్కి రానుంది. ప్రతిపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. ఉత్తర్ప్రదేశ్లో భాజపాను ఎదుర్కోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ మేం వదులుకోం. 2024 ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేస్తాం’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్