2024లో ప్రాంతీయ పార్టీలే కీలకం
రానున్న కొద్ది రోజుల్లో ప్రతిపక్ష కూటమి ఒక రూపు సంతరించుకోనుందని, 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని, భాజపా ఓటమి తమతోనే సాధ్యమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
త్వరలో కూటమికి ఒక రూపు
చేరాలో వద్దో కాంగ్రెస్ ఇష్టం
అఖిలేశ్ యాదవ్ స్పష్టీకరణ
కోల్కతా: రానున్న కొద్ది రోజుల్లో ప్రతిపక్ష కూటమి ఒక రూపు సంతరించుకోనుందని, 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని, భాజపా ఓటమి తమతోనే సాధ్యమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. తమ కూటమిలో చేరాలో వద్దో తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. శనివారం ఓ వార్తాసంస్థకు ఆయన వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ప్రతిపక్ష కూటమి ఏర్పాటుపై జరుగుతున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ముఖ్యమంత్రులు నీతీశ్ కుమార్, మమతా బెనర్జీ, కేసీఆర్లు ఈ విషయంలో కృషి చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఇది ఒక కొలిక్కి రానుంది. ప్రతిపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. ఉత్తర్ప్రదేశ్లో భాజపాను ఎదుర్కోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ మేం వదులుకోం. 2024 ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేస్తాం’ అని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిక తారక్
-
World News
Washington: వాషింగ్టన్లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్రను భగ్నం చేసిన సీక్రెట్ సర్వీస్
-
India News
Rahul Gandhi: పోలీసులు నిరాకరించినా.. ప్రారంభమైన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
-
Politics News
Anam: అక్కడంతా ఏకఛత్రాధిపత్యమే.. వాళ్లకి భజనపరులే కావాలి: ఆనం రామనారాయణరెడ్డి
-
Sports News
Shubman Gill: నేను సెలక్టర్నైనా.. అదే పని చేసేవాణ్ని: శిఖర్ ధావన్