దళిత యువకుడిపై దాడి అమానుషం
దళిత యువకుడిని కొట్టిన సీఐ క్షమాపణలు చెప్పాలని శనివారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి.
సీఐ క్షమాపణ చెప్పాలని తెదేపా నిరసన
అమలాపురం పట్టణం, న్యూస్టుడే: దళిత యువకుడిని కొట్టిన సీఐ క్షమాపణలు చెప్పాలని శనివారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో అమలాపురంలోని గడియారస్తంభం కూడలిలో తెదేపా శనివారం విజయోత్సవాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు భారీ కేకు కోసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. పట్టణ సీఐ డి.దుర్గాశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి తెదేపా నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో విజయోత్సవాల్లో బాణసంచా కాల్చుతున్న అల్లవరం మండల తెదేపా కార్యకర్త, దళిత యువకుడైన బుంగా వెంకటేశ్వరరావుపై సీఐ చేయిచేసుకున్నారని తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఐ క్షమాపణలు చెప్పాలని వర్షంలోనే రహదారిపై బైఠాయించారు. సీఐ, పోలీసులు సర్దిచెప్పి వివరణ ఇవ్వడంతో నిరసన విరమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM