Bhumireddy Ramgopal Reddy: పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణం
ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణాన్ని వదిలి తెదేపా విజయాన్ని చేజిక్కించుకుంది.
ఈనాడు డిజిటల్, కడప: ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందుల గడ్డపై నుంచి రెండో బాణాన్ని వదిలి తెదేపా విజయాన్ని చేజిక్కించుకుంది. గతంలో పార్టీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీటెక్ రవిని పోటీకి పెట్టి వైకాపా అభ్యర్థి దివంగత వైఎస్ వివేకానందరెడ్డిపై విజయం సాధించింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర స్థానం నుంచి పులివెందుల ప్రాంతవాసి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డిని బరిలో నిలిపి గెలిచింది. అధికార వైకాపా వాలంటీర్ల ద్వారా భారీగా బోగస్ ఓట్లను నమోదు చేయించినప్పటికీ ఫలితం సాధించలేకపోయింది. నగదు లావాదేవీలు నడిచినప్పటికీ నిష్ఫలమైంది. రెండో ప్రాధాన్య ఓటు పరస్పరం బదిలీ చేసుకునేలా తెదేపా అధినేత చంద్రబాబు వామపక్షాల అభ్యర్థులతో ఒప్పందానికి వచ్చారు. ఈ నిర్ణయం పశ్చిమ రాయలసీమలో సత్ఫలితాలనిచ్చింది. తెదేపా అభ్యర్థి గెలుపు ప్రకటనకు ముందే శనివారం పులివెందులలో భారీగా సంబరాలు చేసుకున్నారు. అన్ని మండలాల్లో భారీగా టపాకాయలు కాల్చి తెదేపా శ్రేణులు ఆనందాన్ని పంచుకున్నాయి. ఈ సందర్భంగా తొండూరు మండలం ఇనగనూరులో రెండు వర్గాలు రాళ్ల దాడులు చేసుకోగా, వైకాపాకు చెందిన ముగ్గురు, తెదేపా వర్గీయులు ఇద్దరు గాయపడ్డారు. వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోనూ వివిధ ప్రాంతాల్లో తెదేపా సంబరాలు మిన్నంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ