అవినాష్రెడ్డిని కాపాడటానికి కాదని చెప్పగలరా?
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్పై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం జగన్ అత్యవసరంగా దిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని తెదేపా నేతలు ప్రశ్నించారు.
దిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి ఏం సాధించారు?
తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రశ్నలు
అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్పై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం జగన్ అత్యవసరంగా దిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని తెదేపా నేతలు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి వైకాపా ఎంపీ అవినాష్రెడ్డిని కాపాడటానికి కాదని చెప్పగలరా అని సవాలు విసిరారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వెలుపల ఉన్న తుళ్లూరు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వద్ద శనివారం నిరసన తెలిపారు. ‘దిల్లీ వెళ్లి పోలవరానికి నిధులు ఎంత తెచ్చారు?’, ‘అప్పర్భద్ర ఆపారా?’, ‘విశాఖ రైల్వే జోన్ తెచ్చారా?’ అని రాసి ఉన్న ప్లకార్డులతో అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. విభజన హామీల అమలు కోసమే జగన్ దిల్లీ వెళ్లారని బుగ్గన రాజేంద్రనాథరెడ్డి శాసనసభలో ఆవుకథ చెప్పారని ఎద్దేవా చేశారు. ‘నాకు తెలిసినంత వరకు సీఎం హోదాలో జగన్ 18 సార్లు దిల్లీ వెళ్లారు. ఏనాడూ దానిపై మేం సభలో మాట్లాడలేదు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా హుటాహుటిన వెళ్లి ఏం చేశారో చెప్పాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చాం. దానికి సమాధానం చెప్పకుండా బుగ్గన మమ్మల్ని తప్పుపట్టారు. జగన్ దిల్లీ పర్యటనలన్నీ కేసుల మాఫీ కోసమే. ప్రస్తుత పర్యటన వివేకా హత్యకేసు నుంచి బయటపడటానికే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే కేంద్రప్రభుత్వ పెద్దలు ఎవరితో ఏం మాట్లాడారు? ఎన్ని నిధులు సాధించారు? ఏ సమస్యల్ని పరిష్కరించారనే విషయాలు వెల్లడించాలి’ అని అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.
పోలవరం కోసమైతే అంబటి ఎందుకు వెళ్లలేదు?
పోలవరంపై ప్రధానితో చర్చించడానికే జగన్ దిల్లీ వెళ్లారని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అలాంటప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా ఆయన్ను, నీటిపారుదలశాఖ అధికారుల్ని ఎందుకు తీసుకెళ్లలేదు? ఈ ప్రశ్నను అసెంబ్లీలో అడిగితే అంబటి నీళ్లు నమిలారు.
దీపక్రెడ్డి, ఎమ్మెల్సీ
ప్రజలకు ఏం చేశారో చెప్పాలి
సీఎం దిల్లీ పర్యటనపై మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలతో పిచ్చి విమర్శలు చేయించడం ఆపి జగన్ నోరు విప్పాలి. తెదేపా వారిని తిట్టడంపై చూపుతున్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పెద్దలు చూపడం లేదు.
డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే
విర్రవీగితే ఫలితం ఇలాగే ఉంటుంది
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా గెలుపు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇక పనికిరాదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారని ఈ ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి.
ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి