స్మార్ట్మీటర్లా.. ఉరితాళ్లా?
వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్మీటర్ల వ్యవహారం రాష్ట్ర శాసనసభను ఆదివారం కుదిపేసింది. దీనిపై చర్చ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపిన 11 మంది తెదేపా సభ్యులను సభాపతి ఒక రోజు సస్పెండ్ చేశారు.
రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని తెదేపా సభ్యుల నినాదాలు
11 మందిని ఒక రోజు సస్పెండ్ చేసిన సభాపతి తమ్మినేని
తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
ఈనాడు, అమరావతి: వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్మీటర్ల వ్యవహారం రాష్ట్ర శాసనసభను ఆదివారం కుదిపేసింది. దీనిపై చర్చ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపిన 11 మంది తెదేపా సభ్యులను సభాపతి ఒక రోజు సస్పెండ్ చేశారు. దీనికిముందు... స్మార్ట్మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా మారాయని, అందులో రూ.6వేల కోట్ల కుంభకోణం జరిగిందని తెదేపా సభ్యులు నినాదాలు చేశారు. శాసనసభ ఆదివారం కొలువుదీరగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. వ్యవసాయ పంపుసెట్లకు అమర్చనున్న స్మార్ట్ మీటర్ల వివరాలు చెప్పాలని తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, మంతెన రామరాజు అడిగిన ప్రశ్నకు ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లకు 18.57 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్ల కొనుగోలు, నిర్వహణకు రూ.3,406.14 కోట్లు, అనుబంధ పరికరాలకు మరో రూ.2,286.22 కోట్లు అవుతుంది. రైతుల విద్యుత్తు బిల్లులకు డబ్బులను డీబీటీ ద్వారా వారి ఖాతాలకు జమచేస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో అమలుచేయగా 33.75% వినియోగం తగ్గింది. స్మార్ట్మీటర్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’ అన్నారు.
స్మార్ట్మీటర్లు వద్దని విజయానంద్ లేఖ రాశారు: అచ్చెన్నాయుడు
తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ హయాంలో ఒక హార్స్పవర్ రూ.50కి ఇచ్చారు. వైఎస్, కిరణ్కుమార్రెడ్డి, రోశయ్య ప్రభుత్వాల హయాంలో రైతులకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేశారు. ఇదే విధానాన్ని తెదేపా ప్రభుత్వం కొనసాగించింది. ఈ ప్రభుత్వమే స్మార్ట్మీటర్లను ఏర్పాటుచేస్తోంది. ఇవి అక్కర్లేదని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ డిస్కంలకు లేఖ రాశారు. రాష్ట్రంలో పేర్కొన్న ధర మహారాష్ట్రలో ఖరారుచేసిన ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువనీ అన్నారు. అయినా సొంత మనుషులకు టెండర్లు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘విజయానంద్ రాసిన లేఖలో అన్ని రకాల మీటర్లనూ పరిశీలించి చర్యలు తీసుకోవాలనే సూచించారు. ఇందులో తప్పేముంది? స్మార్ట్మీటర్ల కోసం 2021లో రూ.6,480.12 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచాం. ఖర్చు ఎక్కువని టెండర్లు రద్దు చేశాం. 2022లో రూ.5,692.35 కోట్లతో టెండర్లు పిలిచాం. ధర ఇంకా తగ్గేలా చర్చిస్తున్నాం. దీన్ని ఎవరికో ఇచ్చేశామని అచ్చెన్నాయుడు చెప్పేదాంట్లో వాస్తవం లేదు’ అన్నారు.
వైకాపా నేతలకు మైండ్ బ్లాంక్
అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా కన్నబాబు జోక్యం చేసుకోబోయారు. దీంతో.. జగన్ది జైలుపార్టీ అన్నారని, మీరు మాట్లాడకూడదని తెదేపా సభ్యులు అడ్డుకున్నారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ... సొంతపార్టీపై, లోకేశ్పై చేసిన వ్యాఖ్యల గురించి అచ్చెన్నాయుడు ఏమంటారని ప్రశ్నించారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోయేసరికి... మైండ్ బ్లాంక్ అయి వైకాపా నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ దమ్ముంటే రాజీనామా చేసి, టెక్కలి నుంచి మళ్లీ పోటీచేయాలని అచ్చెన్నాయుడికి సవాలు విసిరారు. ఇంతలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిందని సభాపతి తమ్మినేని సీతారాం చెబుతూ తేనీటి విరామం ప్రకటించారు.
చర్చ కొనసాగించాలని పోడియం వద్ద నినాదాలు
సభ మళ్లీ కొలువుదీరగానే.. స్మార్ట్మీటర్లపై చర్చను కొనసాగించాలని సభాపతిని తెదేపా సభ్యులు కోరారు. ప్లకార్డులతో పోడియం వద్దకు వెళ్లారు. కాగితపు ముక్కలను చించి విసరగా.. అవి సభాపతి ముందు పడ్డాయి. సీట్లలో కూర్చోవాలని, ముగిసిన చర్చపై కొనసాగింపునకు అవకాశం లేదని సభాపతి స్పష్టంచేశారు. అయినా తెదేపా సభ్యులు నినాదాలు చేశారు. ఇదే సమయంలో మంత్రులు శాఖలవారీగా గ్రాంట్లను ప్రతిపాదిస్తూ సభ అనుమతిని కోరారు. చివరికి 11 మంది తెదేపా సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. కాసేపటి తర్వాత వారంతా సభ నుంచి బయటకు వెళ్లారు. వీరిలో అచ్చెన్నాయుడు, చినరాజప్ప, ఏలూరు సాంబశివరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవాని, గణబాబు, మంతెన రామరాజు, బాలవీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహనరావు, గొట్టిపాటి రవికుమార్, వెలగపూడి రామకృష్ణ ఉన్నారు. రోజూ సస్పెన్షన్ కోసమే తెదేపా సభ్యులు ఆందోళన చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సభ్యులు పోడియం వద్దకు రావడం తమకు అవమానంగా ఉందని వైకాపా సభ్యుడు సుధాకర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ