సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
లీకేజీ కేసు సీబీఐకి అప్పగించాలి
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, న్యూస్టుడే, గాంధారి: రాష్ట్రంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం నిరుద్యోగ నిరసన దీక్ష శిబిరం, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016 నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, కేటీఆర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సీబీఐకి అప్పగించాలని కోరారు. సీబీఐపై ప్రభుత్వానికి నమ్మకం లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యార్థి విభాగం ఆధ్యర్యంలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశామని వెల్లడించారు. దిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను తీసుకొచ్చి వాదించనున్నామన్నారు. ఈ నెల 21న కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్ను కలుస్తుందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వెనక ఉన్న బడా వ్యక్తుల పేర్లు చెబితే ఎన్కౌంటర్ చేస్తామంటూ చంచల్గూడ జైలులో ఉన్న నిందితులను కొందరు బెదిరించారని ఆరోపించారు. ఈ నెల 13నుంచి 18వరకు జైలు సందర్శకుల వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
పైరవీతో ఉద్యోగం.. పదోన్నతి
టీఎస్పీఎస్సీలో విధులు నిర్వహించే 20మందిని నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్-1 పరీక్షలు రాయడానికి కమిషన్ అనుమతించిందని ఆరోపించారు. అందుకు బాధ్యులెవరో వెల్లడించాలన్నారు. 2016లోజరిగిన గ్రూప్-1 మెయిన్ పరీక్షలో సైతం అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయన్నారు. లీకేజీ కేసులో ఏ-2గా పేర్కొన్న రాజశేఖర్కు ఓ ప్రజాప్రతినిధి పీఏ పైరవీతోనే 2017లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చిందన్నారు. ఆ పీఏ ప్రోద్బలంతోనే రాజశేఖర్కు పదోన్నతిఇచ్చి.. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగంలో సహాయ సెక్షన్ అధికారిగా బాధ్యతలు అప్పగించారన్నారు. ఇందులో సెక్షన్ అధికారి పాత్ర ఏమిటో వెల్లడించాలని డిమాండ్చేశారు. ఆ పీఏ, రాజశేఖర్ స్నేహితులని, వారు జగిత్యాలజిల్లా మల్యాల మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందినవారని రేవంత్ తెలిపారు. దీక్షలో షబ్బీర్అలీ, జీవన్రెడ్డి, సీతక్క, సుదర్శన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ షెట్కార్, మహేష్కుమార్గౌడ్, బలరాంనాయక్, వేంనరేందర్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మదన్మోహన్రావు, వడ్డేపల్లి సుభాష్రెడ్డి, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై తిరుగుబాటు
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. -
తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. -
వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. -
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి
‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
వైకాపాను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు
రాష్ట్రంలో మాదిగలు బాగు పడాలంటే వైయస్ జగన్ను ఓడించి... ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
రెండోరోజు 367 నామినేషన్లు దాఖలు
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
అనకాపల్లి జిల్లాకు చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. కాకినాడ జిల్లా తుని మీదుగా పర్యటిస్తూ వచ్చిన ఆయన రాత్రి తొమ్మిది గంటలకు పాయకరావుపేట చేరుకున్నారు. -
కేసీఆర్.. లెక్కపెట్టుకోండి
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని.. భారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ ప్రతిరోజూ సాయంత్రం లెక్కపెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
భారాస, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే
‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. భారాస.. ప్రజల సొమ్మును లూటీ చేసింది. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
కుప్పంలో చంద్రబాబు నామినేషన్
కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి పాశుపతాస్త్రం
తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నామినేషన్
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
తొలిదశ పోలింగ్ 62.37%
దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్