భాజపా మతోన్మాద విధానాలను తిప్పికొట్టండి

దేశంలో భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలను ప్రజలంతా ప్రతిఘటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

Published : 20 Mar 2023 04:27 IST

జనచైతన్య యాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

చర్ల, న్యూస్‌టుడే: దేశంలో భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలను ప్రజలంతా ప్రతిఘటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. హనుమకొండలో ఈ నెల 17న ప్రారంభమైన జనచైతన్యయాత్ర ఆదివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగిస్తూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా భారత రాజ్యాంగ లౌకిక విలువలకు తూట్లు పొడిచి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీల ప్రథమ శత్రువు భాజపాను గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలని సూచించారు. భాజపా అసలురంగు తెలుసుకున్న కేసీఆర్‌ ఆ పార్టీని ఓడించేందుకు చేస్తున్న పోరాటంలో కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తారని, అదే సమయంలో ఆయన చేసే తప్పులను సమర్థించబోమన్నారు.  ఏడు సార్లు గెలిచిన భద్రాచలంలో ఎర్రజెండాను మరోసారి ఎగరేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని