ప్రజలు కోరుకుంటున్న మార్పు భాజపాతోనే
రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు భాజపాతోనే సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు రాష్ట్రం సహకరించాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు
వచ్చే నెలలో రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారని వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు భాజపాతోనే సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని ప్రజలు సైతం విశ్వసిస్తున్నారని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఏవీఎన్రెడ్డి గెలుపే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు భాజపా చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ సమాజం సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రజలు చూపుతున్న విశ్వాసంతో పూర్తి ఆత్మస్థైర్యంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ముందుకు వెళ్తుందని అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించినందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు. అబద్ధాలు, అధికార దుర్వినియోగం, డబ్బులు, మద్యం ద్వారా గెలుస్తామనే ధోరణిని కల్వకుంట్ల కుటుంబం కనబరుస్తోంది. ఇలాంటి వాటిని తెలంగాణ సమాజం అంగీకరించదని ఈ ఎన్నిక ద్వారా రుజువైంది. మునుగోడులోనూ నిజమైన గెలుపు భాజపాది, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిదే. ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం ఆయన కుటుంబం వైపు చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే భాజపాపై ఆరోపణలు చేస్తున్నారు. మద్యం కేసు నుంచి దృష్టి మళ్లించడానికి మహిళా బిల్లుపై పోరాటం చేస్తున్న భారాసకు.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
సికింద్రాబాద్ స్టేషన్ పనుల శంకుస్థాపనకు మోదీ..
వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్నారు. రూ.720 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు, జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేస్తారు. రూ.10 వేల కోట్లతో మంచిర్యాల- విజయవాడ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని నిర్మిస్తున్నాం. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు త్వరలో ప్రారంభమవుతుంది.
పీఎం మిత్ర మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కును రాష్ట్రానికి మంజూరు చేసినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో చేనేత రంగానికి, రాష్ట్రాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. టెక్స్టైల్ పార్కు అంశంలో రాజకీయాల జోలికి పోకుండా.. ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం బాధ కలిగించింది’’ అని కిషన్రెడ్డి అన్నారు. సమావేశంలో నేతలు బూర నర్సయ్యగౌడ్, ప్రకాశ్రెడ్డి, సంగప్ప, సుభాష్, శ్రీధర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!