CM Jagan: నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు
నేరగాళ్లకు దేవుడు సరైన సమయంలో మొట్టికాయలు వేస్తాడని సీఎం జగన్ అన్నారు. తెదేపాకు ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారని, గజదొంగల ముఠా మళ్లీ రాజ్యాధికారం చేపట్టకుండా ప్రజలు ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడించారు.
ఎంత తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక పొరపాటు చేస్తాడు
నైపుణ్య కుంభకోణాన్ని చంద్రబాబే నడిపారు
కేబినెట్ ఆమోదం, ఉత్తర్వులకు విరుద్ధంగా ఒప్పందం
శాసనసభలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: నేరగాళ్లకు దేవుడు సరైన సమయంలో మొట్టికాయలు వేస్తాడని సీఎం జగన్ అన్నారు. తెదేపాకు ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారని, గజదొంగల ముఠా మళ్లీ రాజ్యాధికారం చేపట్టకుండా ప్రజలు ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడించారు. శాసనసభలో సోమవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ కుంభకోణంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎంత తెలివైన నేరస్థుడైనా ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. దేవుడు మొట్టికాయలు వేయాలనుకున్నప్పుడు అవి కచ్చితంగా బయటపడతాయి. నైపుణ్యం పేరుతో డబ్బులు దోచేయడం చంద్రబాబుకే తెలిసిన గొప్ప నైపుణ్యం. కుంభకోణాన్ని చంద్రబాబే నడిపారు. రూ.371 కోట్ల ప్రభుత్వనిధులు హారతికర్పూరంలా మాయమైపోయాయి. ఈ డబ్బు డొల్లకంపెనీల ద్వారా రకరకాలుగా తిరిగి, చంద్రబాబుకు వచ్చింది. ఈ కుంభకోణం రాష్ట్రంలో మొదలై విదేశాలకు చేరింది. అక్కడి నుంచి చంద్రబాబు నివాసం ఉన్న హైదరాబాద్కి వచ్చింది. ఈ కుంభకోణంపై సీఐడీతోపాటు జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ.. ఇలా సంస్థలన్నీ దర్యాప్తు చేస్తున్నాయి. చేయని నైపుణ్యాభివృద్ధిని ఎలా చూపించాలి? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి? చట్టానికి దొరకకుండా ఏయే దస్త్రాలను మాయం చేయాలి? విచారణ జరిగితే తప్పించుకునేందుకు ఏం చేయాలి? ఇవన్నీ ముందుగానే ఊహించుకొని విజన్ రూపకల్పన చేసినట్లు కనిపిస్తోంది’’ అని ఆరోపించారు.
నైపుణ్యంతో దోచేశారు..
‘‘ఇది దేశచరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద కుంభకోణం. నైపుణ్యం పేరిట గత ప్రభుత్వంలో ఎలా దోచేశారన్నది సభ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజలందరికీ తెలియాలి. చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే నైపుణ్యాభివృద్ధి కుంభకోణం మొదలైంది. తమ మనుషులను నైపుణ్యాభివృద్ధి సంస్థలో పెట్టారు. అక్కడినుంచి కథ నడిపించారు. సీమెన్స్ ఇండియా కంపెనీలో ఓ ఉన్నతాధికారితో లాలూచీ పడ్డారు. ఆయన్ను వాడుకొని దోపిడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం రూ.3,356 కోట్లయితే ప్రభుత్వవాటా 10శాతం. సీమెన్స్ 90% పెడుతుందట. ప్రపంచంలో ఎక్కడైనా ప్రైవేటు కంపెనీ రూ.3వేల కోట్లు ఎలా ఇస్తుందని ఆలోచించలేదు. లాలూచీపడ్డ ఇద్దరు వ్యక్తులు తయారుచేసిన అంచనాలను నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నోట్గా పెట్టించారు. కేబినెట్లోకి దీన్ని ప్రత్యేక ఐటమ్గా తీసుకొచ్చి, ఉత్తర్వులిచ్చారు. కేబినెట్లో నోట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధం’’ అన్నారు.
ఒప్పందంలో అనేక లోపాలు
‘‘కేబినెట్ ఆమోదం, ఉత్తర్వులు ఒకలా ఉండగా.. ఒప్పందంలో ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆరు క్లస్టర్లలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, టెక్నికల్ నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఏర్పాటుచేస్తామని, ఇందులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు ప్రభుత్వం రూ.55 కోట్లు వెచ్చిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీమెన్స్ 90% గ్రాంటు ఇన్ ఎయిడ్ కింద రూ.3వేల కోట్లు ఇస్తుందని చెప్పారు. ఒప్పందానికి వచ్చేసరికి గ్రాంటు ఇన్ ఎయిడ్ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10% కాంట్రిబ్యూషన్ కాస్తా ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా మార్చేశారు. ఇక్కడే కుంభకోణానికి బీజం పడింది. ఏ లేఖ ఆధారంగా.. ఏ తేదీ జారీచేసిన.. ఏ ఉత్తర్వు ఆధారంగా.. ఒప్పందం కుదుర్చుకున్నారో ఒప్పందంలో ఖాళీగా వదిలేశారు. ఉత్తర్వుల్లో ఉన్న అంశాలు ఒప్పందంలో లేకపోతే ఎలా సంతకాలు చేశారు? చంద్రబాబు స్క్రిప్టు, డైరెక్షన్ లేకుండా జరుగుతాయా? ప్రభుత్వం నుంచి 10% నిధులు విడుదల చేసినా సీమెన్స్ నుంచి ఒక్క పైసా రాలేదు. ప్రభుత్వం నుంచి ఒక విడత డబ్బులు వెళ్తాయి. తర్వాత డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరగానే రెండోవిడత విడుదల చేశారు. మేము డీబీటీ ద్వారా బటన్ నొక్కితే అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. కానీ, చంద్రబాబు బటన్ నొక్కితే ప్రభుత్వఖాతా నుంచి చంద్రబాబు ఖాతాలోకి వెళ్లాయి. డబ్బుల విడుదలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తన నోట్ఫైల్లో అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రధాన నిందితుడు అనేందుకు ఇంకా నిదర్శనాలు కావాలా?’’ అని ప్రశ్నించారు.
ఆ నిధులు ఎక్కడికి పోయాయి?
‘‘ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎక్కడికి పోయాయోనని తీగ లాగితే డొంక కదిలింది. సీమెన్స్ సంస్థ వారు అంతర్గతంగా విచారణ చేసి, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఒప్పందంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్బోస్ అనే వ్యక్తి యాజమాన్యాన్ని గానీ, లీగల్ బృందాన్ని గానీ సంప్రదించలేదని కోర్టుకు తెలిపారు. సీమెన్స్ ఎలాంటి ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిర్వహించలేదని, ఇలాంటి పథకాలు తమ సంస్థలో లేవని చెప్పింది. సీమెన్స్కు రూ.370 కోట్లు ఇచ్చారు. వాళ్లు తమకు రాలేదంటున్నారు. ఈ డబ్బులు ఎవరికి పోయాయి? అనేక డొల్లకంపెనీల ద్వారా మనీలాండరింగ్ జరిగి, వీళ్ల చేతుల్లోకి వచ్చింది. నైపుణ్యాభివృద్ధి కుంభకోణంపై 2018 జూన్లో ఒక వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. విచారణ మొదలుపెట్టిన ఏసీబీ ఆ తర్వాత వచ్చిన ఆదేశాలతో దస్త్రాన్ని మూలకు పడేసింది. ఆ తర్వాత నోట్ఫైల్స్ మాయం చేశారు. వివిధ శాఖల్లో ఉండే షాడో ఫైల్స్ ద్వారా నైపుణ్య కుంభకోణాన్ని తోడడం మొదలుపెట్టాకే బయటకు వచ్చింది. ఈ కుంభకోణంలో ప్రధానపాత్ర పోషించిన పీవీఎస్పీ/స్కిల్లర్, డిజైన్టెక్ సేవాపన్ను కట్టకుండా పన్ను కోసం క్లెయిమ్ చేశాయి. రూ.కోట్లు క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఈ కంపెనీల లావాదేవీలపై దృష్టిపెట్టారు. ఇది 2017లోనే బయటపడింది. దీనిపై అప్పటి రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. ఈ కేసులో సీఐడీ అరెస్టులు చేస్తుంటే రాజకీయ కక్షసాధింపు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ కేసులో ఈడీ నలుగుర్ని అరెస్టు చేసింది. కుంభకోణం చేసి, పట్టుబడిన తర్వాత వీళ్లు దొరికిపోతున్నందున చంద్రబాబులో అంత భయం ఉంది’’ అని ఆరోపణలు గుప్పించారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ కుంభకోణంలో ఇక అరెస్టులు: మంత్రి అమర్నాథ్
‘ నైపుణ్యాభివృద్ధి సంస్థ కుంభకోణంలో ఈడీ ఇటీవల 10 మందిని అరెస్టు చేసింది. ఇక అరెస్టయ్యేది సూత్రధారే’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. శాసనసభలో లఘుచర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘రూ.241 కోట్లలో రూ.173 కోట్లు జమ అయిన స్కిల్లర్ అనే కంపెనీని, ఈ ఒప్పందానికి నెలరోజుల ముందే స్థాపించారు’ అని పేర్కొన్నారు. డొల్ల కంపెనీలకు మళ్లించిన నిధుల్లో రెండు టోకెన్లు హైదరాబాద్కు వెళ్లాయని, అవి ఎవరి కోసం వెళ్లాయనే దానిపై దర్యాపు చేయాలని వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. -
ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు
ఇటీవల భాజపాలో చేరిన సీనియర్ నేత అశోక్ చవాన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. -
ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించించగా మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. -
ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు
‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
-
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?